YS Vivekananda Reddy Case: వైఎస్ వివేకా హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు.. వాస్తవాలు వెలికి తీసేందుకు ఒక్కరోజు చాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యర్థి పార్టీలపై దాడి చెయ్యడానికి ప్రతి అంశాన్ని వాడుకుంటుందని ఆరోపించారు.. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి మద్యం స్కామ్ బయటకు తీశారన్న ఆయన.. కేంద్రానికి లొంగిపోయిన ప్రభుత్వాలతో సాఫ్ట్ గా ఉంటున్నారని విమర్శించారు. కేసీఆర్ కూతురుపై కేసు పెట్టారు.. కానీ, నాలుగేళ్లైనా వైఎస్ వివేకానంద రెడ్డి కేసు తేల్చలేదని మండిపడ్డారు.. పులివెందులలో పిల్లల్ని అడిగినా వివేకానందరెడ్డిని ఎవరు చంపారో చెబుతారని పేర్కొన్న ఆయన.. వివేకానంద రెడ్డి సామాన్యుడు కాదు… సీబీఐ ఎంత కాలం ఆయన హత్య కేసు దర్యాప్తు చేసింది..? ఆ హత్య కేసులో వాస్తవాలు బయటికి తీయడానికి ఒక్క రోజు చాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: Telangana: తెలంగాణలో అమర రాజా బ్యాటరీస్ భారీ పెట్టుబడి
Also Read
- Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సీబీఐ పక్షపాతంతో వ్యవహరిస్తుంది.. ఇది సరైంది కాదని హితవుపలికారు రామకృష్ణ.. బీజేపీ కండువా కప్పుకుంటే కేసులు లేకుండా చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. వివేకానంద రెడ్డి కేసు తెలంగాణకి మార్చడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్ సిగ్గుతో తలదించుకోవాలని ఎద్దేవా చేశారు.. సొంత బాబాయి కేసులో సరైన దర్యాప్తుకి సహకరించకుండా, న్యాయం జరగకుండా చేసినందుకు జగన్ సిగ్గు పడాలి అంటూ మండిపడ్డారు. మరోవైపు, పేద వర్గాలు పంపిణీ కోసం ఎదురుచూస్తున్న టిడ్కో ఇళ్ల విషయంలో ప్రభుత్వం స్పందించాలని.. టిడ్కో ఇళ్ల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. మూడేళ్ల క్రితం టిడ్కో ఇళ్లు ఎలా ఉన్నాయో.. ఇప్పటికీ అలాగే ఉన్నాయి.. టిడ్కో ఇళ్లు చంద్రబాబు హయాంలో నిర్మించడం వలనే కక్ష పూరితంగా లబ్ధిదారులకు అందకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకి ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
తాజావార్తలు
-
US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
-
Splitsvilla: ‘ప్రేమ కావాలా? పైసా కావాలా?’: జియోహాట్స్టార్ తెలుగులో ‘ఎమ్టీవీ స్ప్లిట్స్విల్లా X6’ స్ట్రీమింగ్!
-
Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
-
He-Man: ‘హీ-మ్యాన్’గా యంగ్ హీరో నిఖిల్.. దద్దరిల్లుతున్న ట్రైలర్!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సెలబ్రేషన్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ ఇదే.. అందరినీ ఏడిపించేశాడుగా..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!