YS Vivekananda Reddy Case: వైఎస్ వివేకా హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు.. వాస్తవాలు వెలికి తీసేందుకు ఒక్కరోజు చాలు..!
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యర్థి పార్టీలపై దాడి చెయ్యడానికి ప్రతి అంశాన్ని వాడుకుంటుందని ఆరోపించారు.. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి మద్యం స్కామ్ బయటకు తీశారన్న ఆయన.. కేంద్రానికి లొంగిపోయిన ప్రభుత్వాలతో సాఫ్ట్ గా ఉంటున్నారని విమర్శించారు. కేసీఆర్ కూతురుపై కేసు పెట్టారు.. కానీ, నాలుగేళ్లైనా వైఎస్ వివేకానంద రెడ్డి కేసు తేల్చలేదని మండిపడ్డారు.. పులివెందులలో పిల్లల్ని అడిగినా వివేకానందరెడ్డిని ఎవరు చంపారో చెబుతారని పేర్కొన్న ఆయన.. వివేకానంద రెడ్డి సామాన్యుడు కాదు… సీబీఐ ఎంత కాలం ఆయన హత్య కేసు దర్యాప్తు చేసింది..? ఆ హత్య కేసులో వాస్తవాలు బయటికి తీయడానికి ఒక్క రోజు చాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: Telangana: తెలంగాణలో అమర రాజా బ్యాటరీస్ భారీ పెట్టుబడి
Also Read
- AP SSC Results 2026: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. పెరిగిన ఉత్తీర్ణత..
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- AP SSC Results 2026: ఇవాళే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా చెక్ చేయండి..
- AP Cabinet Meeting Today: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అజెండా..
వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సీబీఐ పక్షపాతంతో వ్యవహరిస్తుంది.. ఇది సరైంది కాదని హితవుపలికారు రామకృష్ణ.. బీజేపీ కండువా కప్పుకుంటే కేసులు లేకుండా చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. వివేకానంద రెడ్డి కేసు తెలంగాణకి మార్చడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్ సిగ్గుతో తలదించుకోవాలని ఎద్దేవా చేశారు.. సొంత బాబాయి కేసులో సరైన దర్యాప్తుకి సహకరించకుండా, న్యాయం జరగకుండా చేసినందుకు జగన్ సిగ్గు పడాలి అంటూ మండిపడ్డారు. మరోవైపు, పేద వర్గాలు పంపిణీ కోసం ఎదురుచూస్తున్న టిడ్కో ఇళ్ల విషయంలో ప్రభుత్వం స్పందించాలని.. టిడ్కో ఇళ్ల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. మూడేళ్ల క్రితం టిడ్కో ఇళ్లు ఎలా ఉన్నాయో.. ఇప్పటికీ అలాగే ఉన్నాయి.. టిడ్కో ఇళ్లు చంద్రబాబు హయాంలో నిర్మించడం వలనే కక్ష పూరితంగా లబ్ధిదారులకు అందకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకి ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
తాజావార్తలు
-
Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్
-
Bhoghi : ‘కందుల సులోచన రాణి’గా.. అనుపమ.. ఫస్ట్ లుక్ బాగుంది
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Jasprit Bumrah: సీన్ రివర్స్.. బ్యాటర్ల ముందు బెంబేలెత్తిపోతున్న బుమ్రా.. కెరీర్లోనే చెత్త ప్రదర్శన!
-
Dhruva Natchathiram : విక్రమ్ సినిమా వస్తోంది.. కానీ సూర్యతో పోటీ తప్పేలా లేదు
ట్రెండింగ్
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!