Minister Anam: దేవాలయాలలో నెయ్యి సరఫరాపై కమిటీ వేసిన మంత్రి ఆనం
- దేవాలయాలలో నెయ్యి సరఫరాపై ఉన్నత స్థాయి కమిటీ..
- ఆలయాల్లో ప్రసాదాల తయారీ.. ఇతర అవసరాల కోసం నెయ్యి..
- కమిటీ 15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి: మంత్రి ఆనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Anam: దేవాలయాలలో నెయ్యి సరఫరాపై ఉన్నత స్థాయి కమిటీని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వేశారు. దేవాలయాల్లో ప్రసాదాల తయారీ, ఇతరత్రా అవసరాల కోసం వినియోగించే నెయ్యిని సేకరించే విషయంలో అనుసరించాల్సిన విధి విధానాల్లో మార్పులు చేశారు. ఈ కమిటీ పదిహేను రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో దేవాలయాలకు నెయ్యి సరఫరా తీరు తెన్నులపై వివిధ డెయిరీ సంఘాలు, సంస్థల ప్రతినిధులతో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో వివిధ అవసరాల నిమిత్తం ఏటా సుమారు 1500 టన్నుల ఆవు నెయ్యి అవసరం అవుతుంది. దీనిని పూర్తి నాణ్యత ప్రమాణాలతో, సకాలంలో, నిర్దేశిత పరిమాణంలో సేకరించేలా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని ఆనం రామానారాయణ రెడ్డి తెలిపారు.
Read Also: AP Cabinet: నవంబర్ 6న ఏపీ కేబినెట్ భేటీ.. 12న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం
Also Read
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
ఇక, ఒక కేజీ ఆవు నెయ్యి ఉత్పత్తికి, సుమారు 25 లీటర్ల పాలు అవసరమన్న విషయాన్ని వారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వివరించారు. దేవాలయాలు డెయిరీల నుంచి నేరుగా నెయ్యిని సేకరించే విధానం అమలులో ఉండగా 2022లో దీనిని మార్చి.. టెండరింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. టెండర్లలోని షరతులు, నిబంధనలు మొదలైన వాటి కారణంగా పలు డెయిరీలు సరఫరాకు వెనకడుగు వేశారని ఆయన చెప్పుకొచ్చారు. నెయ్యి సరఫరాకు సమగ్రమైన విధానాన్ని రూపొందించేందుకు సీనియర్ అధికారులు, డెయిరీల ప్రతినిధులు, ఎస్వీ డెయిరీ కళాశాల ప్రతినిధులు, ఇతర నిపుణులతో తదితరులతో ఒక ఉన్నతస్థాయి కమిటినీ ఏర్పాటు చేశాం.. ఈ కమిటీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని పరిస్థితులను అధ్యయనం చేయాలి.. అవసరమైతే ఆ ప్రాంతాల్లో పర్యటించి సమగ్రంగా నివేదిక రూపొందించేలా మార్గదర్శకాలు ఇవ్వాలి.. రాష్ట్రంలోని పాడి సంపద, పాల ఉత్పత్తి, నిత్యావసరాలకు పాల వినియోగం కాకుండా.. నెయ్యి ఉత్పత్తికి అవసరమైన పాల లభ్యత కావాలని.. ఏయే ప్రాంతంలో గో సంపద ఎక్కువగా ఉన్న విషయాలన్నిటిపై ఈ కమిటీ అధ్యయనం చేయాలని మంత్రి రామానారాయణ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Protein Food : అమ్మ జ్ఞాపకం.. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన లావోటియన్ ‘ఎగ్ హాష్’!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
ట్రెండింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!