Minister Anam: దేవాలయాలలో నెయ్యి సరఫరాపై కమిటీ వేసిన మంత్రి ఆనం
- దేవాలయాలలో నెయ్యి సరఫరాపై ఉన్నత స్థాయి కమిటీ..
- ఆలయాల్లో ప్రసాదాల తయారీ.. ఇతర అవసరాల కోసం నెయ్యి..
- కమిటీ 15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి: మంత్రి ఆనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Anam: దేవాలయాలలో నెయ్యి సరఫరాపై ఉన్నత స్థాయి కమిటీని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వేశారు. దేవాలయాల్లో ప్రసాదాల తయారీ, ఇతరత్రా అవసరాల కోసం వినియోగించే నెయ్యిని సేకరించే విషయంలో అనుసరించాల్సిన విధి విధానాల్లో మార్పులు చేశారు. ఈ కమిటీ పదిహేను రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో దేవాలయాలకు నెయ్యి సరఫరా తీరు తెన్నులపై వివిధ డెయిరీ సంఘాలు, సంస్థల ప్రతినిధులతో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో వివిధ అవసరాల నిమిత్తం ఏటా సుమారు 1500 టన్నుల ఆవు నెయ్యి అవసరం అవుతుంది. దీనిని పూర్తి నాణ్యత ప్రమాణాలతో, సకాలంలో, నిర్దేశిత పరిమాణంలో సేకరించేలా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని ఆనం రామానారాయణ రెడ్డి తెలిపారు.
Read Also: AP Cabinet: నవంబర్ 6న ఏపీ కేబినెట్ భేటీ.. 12న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం
Also Read
- Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
- AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
- RK Roja: మంత్రి లోకేష్పై రోజా సంచలన ఆరోపణలు..
ఇక, ఒక కేజీ ఆవు నెయ్యి ఉత్పత్తికి, సుమారు 25 లీటర్ల పాలు అవసరమన్న విషయాన్ని వారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వివరించారు. దేవాలయాలు డెయిరీల నుంచి నేరుగా నెయ్యిని సేకరించే విధానం అమలులో ఉండగా 2022లో దీనిని మార్చి.. టెండరింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. టెండర్లలోని షరతులు, నిబంధనలు మొదలైన వాటి కారణంగా పలు డెయిరీలు సరఫరాకు వెనకడుగు వేశారని ఆయన చెప్పుకొచ్చారు. నెయ్యి సరఫరాకు సమగ్రమైన విధానాన్ని రూపొందించేందుకు సీనియర్ అధికారులు, డెయిరీల ప్రతినిధులు, ఎస్వీ డెయిరీ కళాశాల ప్రతినిధులు, ఇతర నిపుణులతో తదితరులతో ఒక ఉన్నతస్థాయి కమిటినీ ఏర్పాటు చేశాం.. ఈ కమిటీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని పరిస్థితులను అధ్యయనం చేయాలి.. అవసరమైతే ఆ ప్రాంతాల్లో పర్యటించి సమగ్రంగా నివేదిక రూపొందించేలా మార్గదర్శకాలు ఇవ్వాలి.. రాష్ట్రంలోని పాడి సంపద, పాల ఉత్పత్తి, నిత్యావసరాలకు పాల వినియోగం కాకుండా.. నెయ్యి ఉత్పత్తికి అవసరమైన పాల లభ్యత కావాలని.. ఏయే ప్రాంతంలో గో సంపద ఎక్కువగా ఉన్న విషయాలన్నిటిపై ఈ కమిటీ అధ్యయనం చేయాలని మంత్రి రామానారాయణ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..