నేడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి… కోవిడ్ నివారణ చర్యలు, వాక్సినేషన్ వేగవంతంపై దిశా నిర్దేశం చేయనున్నారు సీఎం… మరోవైపు.. భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించనున్న ఆయన.. ఖరీఫ్ సన్నద్ధతపై కూడా సమీక్ష చేయనున్నారు.. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల అందుబాటుపై చర్చించనున్నారు.. మరోవైపు.. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్, అర్బన్ హెల్త్ క్లినిక్స్, బీఎంయూల నిర్మాణ ప్రగతిపై సమీక్ష నిర్వహించనున్నారు.. ఇళ్ల నిర్మాణం, పట్టాల పంపిణీపై దిశా నిర్దేశం చేయనున్న సీఎం.. గ్రామ, వార్డ్ సచివాలయాల తనిఖీల తీరును సమీక్షించనున్నారు..