YSRCP: టార్గెట్ 2024.. వైసీపీ నేతలతో జగన్ విస్తృతస్థాయి సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో అప్పుడే ఎన్నికల కోసం వ్యూహాలు సిద్ధం చేస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. 2024 ఎన్నికలను టార్గెట్గా పెట్టుకుంది.. అందులో భాగంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సన్నద్ధత సమావేశం నిర్వహించారు.. మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో భేటీ అయ్యారు సీఎం జగన్.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరుగుతోన్న ఈ సమావేశంలో.. ఈ మూడేళ్లలో ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం పై చర్చ సాగుతోంది.. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పి కొట్టడం, నేతల మధ్య సమన్వయం ప్రధాన అజెండాగా సమావేశం నిర్వహిస్తున్నారు. వచ్చే రెండేళ్లలో ప్రజల్లోకి ఏ రకంగా వెళ్లాలి అనే అంశంపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు ఏపీ సీఎం.
Read Also: Minister KTR : కేసీఆర్ లాంటి టార్చ్ బేరర్ దేశానికి అవసరం
Also Read
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
- Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
ఇక నుంచి నేతలంతా ప్రజల్లోనే ఉండాలని కీలక సూచనలు చేశారు సీఎం జగన్.. నేతల పని తీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుందని సీఎం చెప్పే అవకాశం ఉండగా.. నేతలు తమ పని తీరు మెరుగు పరచుకోకపోతే ఇబ్బందులు ఉంటాయని చెప్పే అవకాశం కూడా ఉందంటున్నారు.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుకెళ్లే విధంగా మంత్రులు, జిల్లా అధ్యక్షులు చూసుకోవాలని సూచనలు చేయనున్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమం ఎంత అందుతోంది? సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రయోజనాలు తెలుసుకునేల ప్రణాళికలు? త్వరలో సీఎం జిల్లాల పర్యటనలు, జూలైలో పార్టీ ప్లీనరీ పై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.. మొత్తంగా కొత్త కేబినెట్ ఏర్పాటు, మంత్రుల ప్రమాణస్వీకారం.. కొత్త జిల్లాలకు పార్టీ అధ్యక్షుల నియామకం ఇలా.. పార్టీ పటిష్టత, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై దూకుడుగా ముందుకు వెళ్తున్నారు సీఎం వైఎస్ జగన్.
తాజావార్తలు
-
Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
-
India – Oman Gas Pipeline: ఇక, హార్మూజ్తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
-
India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
ట్రెండింగ్
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!