CM Jagan: మా ప్రభుత్వం పండగ.. మీ ప్రభుత్వం దండగ..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan: ఏపీలో పారిశ్రామిక అభివృద్ధిపై అసెంబ్లీలో హాట్ హాట్గా చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ కోసం 17 రాష్ట్రాలు పోటీ పడ్డాయని.. ఆ పార్క్ మనకు ఇస్తామని కేంద్రం చెప్పిందని.. కానీ ఆ పార్కు వద్దని కేంద్రానికి టీడీపీ లేఖ రాసిందని జగన్ ఆరోపించారు. బల్క్ డ్రగ్ పార్క్ వల్ల ఎలాంటి పొల్యూషన్ ఉండదని.. రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్లతో డ్రగ్ పార్క్ వస్తుంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని.. ఎన్నో కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే ఏపీ నంబర్వన్గా ఉందని సీఎం జగన్ ప్రకటించారు. గతంలో కంటే వైసీపీ పాలనలోనే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్నారు. అదానీ, అంబానీ, టాటా, బిర్లా వంటి సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత చంద్రబాబుదేనని సీఎం జగన్ మండిపడ్డారు. పారిశ్రామిక రంగాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారని జగన్ ఆరోపించారు. ఏపీలో కొత్త పరిశ్రమలు వస్తే మరో 40వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సీఎం జగన్ వివరించారు. తమ ప్రభుత్వం ప్రజలకు పండగ లాగా ఉంటే గత ప్రభుత్వం దండగ మాదిరిగా ఉండేదని ఎద్దేవా చేశారు.
Read Also:Minister Roja: పవన్ కళ్యాణ్కు మంత్రి రోజా సవాల్.. దమ్ముంటే 175 సీట్లలో పోటీ చేయాలి
Also Read
- Motkupalli Narasimhulu: ఎన్టీఆర్ను గుర్తుచేసుకుంటూ మోత్కుపల్లి భావోద్వేగం.. “మనసున్న నాయకుడిని మళ్లీ చూడలేం”
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- RK Roja: మరోసారి విరుచుకుపడ్డ రోజా.. టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు..
- TDP Mahanadu: మహానాడులో చంద్రబాబు కీలక తీర్మానం.. ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలి..
గత ప్రభుత్వ హయాంలో 34,108 ఉద్యోగాలను భర్తీ చేస్తే.. ఈ మూడేళ్లలో 2.06 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు సీఎం జగన్ చెప్పారు. ఔట్సోర్సింగ్లో 3.71 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 51,387 మందికి ఉద్యోగాలు కల్పించామని వివరించారు. మెడికల్లో 16,880 ఉద్యోగాలు ఇచ్చామని.. 2.60 లక్షల మందికి వాలంటీర్లుగా నియమించినట్లు తెలిపారు. వీరిలో 84 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారని సీఎం జగన్ వెల్లడించారు. అటు పోలవరం ప్రాజెక్టు నిధులు రాకపోవడానికి.. అప్పటి సీఎం చంద్రబాబు తీరే కారణమని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద గతంలో చంద్రబాబు హయాంలో 6.86 లక్షలు ఇస్తే.. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 10 లక్షలు చేస్తామని చెప్పామని… చెప్పిన మాటే చేస్తున్నామన్నారు. అందుకు తగినట్లుగా జీవో కూడా జారీ చేశామన్నారు. దాని గురించి ఆక్షేపణ లేదు, చర్చ కూడా లేదన్నారు. కళ్లు ఉండి చూడలేకపోతే సమాధానం చెప్పలేం కానీ.. కళ్లు ఉండి చూడగలిగితే చూడాలంటూ సీఎం జగన్ చురకలు అంటించారు.
తాజావార్తలు
-
Megastar Chiranjeevi : ఇండస్ట్రీకి ఏ కష్టం వచ్చినా ఆయనే ముందుంటాడు.. మరోసారి నిరూపించిన మెగాస్టార్..!
-
Vaibhav Sooryavanshi: అది బ్యాటింగ్ కాదు.. వైభవ్ బ్యాట్లో ఏదో ఉంది.. కీలక వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఆటగాళ్లు..
-
Vibhav suryavanshi: ఢిల్లీ క్యాపిటల్స్ పశ్చాత్తాపం.. కొన్ని లక్షల కోసం వైభవ్ను వదులుకున్నారు..
-
Siddaramaiah: కర్ణాటకలో పవర్ ఛేంజ్.. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా
-
DK Shivakumar: వందల కోట్ల షాపింగ్ మాల్, కోట్ల సంపద.. కర్ణాటక కొత్త సీఎం వైభవం..
ట్రెండింగ్
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!