Andhra Pradesh: జూన్లో అమ్మ ఒడి.. జూలైలో జగనన్న విద్యాకానుక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యాశాఖపై గురువారం మధ్యాహ్నం క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా అమ్మ ఒడికి బదులుగా ల్యాప్ టాప్ ఆప్షన్ను 8.21 లక్షల మంది విద్యార్థులు ఎంచుకున్నారని అధికారులు సీఎం జగన్కు వివరించారు. నాడు-నేడులో భాగంగా ఇప్పటి వరకు 33వేల అదనపు తరగతులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. సుమారు 23,975 స్కూళ్లలో నాడు-నేడు రెండో దశ కింద పనులు జరుగుతున్నాయని.. నెల రోజుల్లోగా నూటికి నూరు శాతం రెండో దశ కింద చేపట్టనున్న అన్ని స్కూళ్లలో పనులు ప్రారంభం కావాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.
టీఎంఎఫ్, ఎస్ఎంఎఫ్, గోరుముద్ద కార్యక్రమాలపై అధికారులు మరింత శ్రద్ధ పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆయా కార్యక్రమాలను సమర్ధవంతంగా, నాణ్యతతో అమలు చేయాలని, అప్పుడే ఆశించిన లక్ష్యాలను చేరుకుంటామని తెలిపారు. గతంలో రాష్ట్రంలో సుమారు 400 జూనియర్ కళాశాలలు మాత్రమే ఉండేవి అని.. కానీ ఈరోజు ఏకంగా 1200 జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. బాలికలకు ప్రత్యేకంగా మండలానికి ఒక జూనియర్ కళాశాల లేదా కేజీబీవీ లేదా హైస్కూల్ ప్లస్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ విషయం అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. తద్వారా వీటిని బాలికలు వినియోగించుకునే అవకాశాలు మెరుగుపడతాయని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, బాత్రూమ్ల నిర్వహణ వంటివి సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. దీని కోసం పక్కాగా ఎస్ఓపీలు ఉండాలని సీఎం జగన్ సూచించారు. అటు జగనన్న విద్యాకానుక కిట్ నాణ్యతలో ఎక్కడా రాజీపడొద్దని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కిట్ల పంపిణీకి సర్వం సన్నద్ధంగా ఉండాలన్నారు. జూలై 4 నాటికి జగనన్న విద్యాకానుక ప్రారంభానికి సకలం సన్నద్ధం చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు.
Also Read
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
- Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
మరోవైపు జూన్లో అమ్మ ఒడి నిధులు పంపిణీ చేసేలా అధికారులు సన్నద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఇంగ్లీష్లో మంచి ప్రావీణ్యం సంపాదించిన బెండపూడి విద్యార్ధులను సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. బెండపూడి హైస్కూల్ ఇంగ్లీషు టీచర్ ప్రసాద్ పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించిన బోధనా విధానాన్ని ఎస్ఓపీగా రూపొందించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో అన్ని స్కూళ్లలో ఈ తరహా లెర్నింగ్ విధానాన్ని ప్రవేశపెట్టేలా చూడాలన్నారు. ఫొనిటిక్స్పై ప్రస్తుతం రీసెర్చ్ చేస్తున్న వారిని ఇందులో భాగస్వామ్యులను చేయాలన్నారు. ఇంగ్లీష్ భాష సమగ్రంగా నేర్చుకోవడంలో యాక్సెంట్, డైలెక్ట్ చాలా ప్రధానమైన అంశాలని సూచించారు. ఈ విషయాలపై అధికారులు ఎక్కువ ఫోకస్ పెట్టాలన్నారు. గూగుల్ రీడ్ ఎలాంగ్ యాప్ ప్రతి టీచర్ మొబైల్లో ఉండేలా చూడాలని సీఎం జగన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
-
Modi-Yogi Meeting: మోడీతో యోగీ భేటీ.. యూపీ ఎన్నికలపై చర్చ..!
-
EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్డ్రాయల్, నామినేషన్పై ప్రభావం
-
Trump: ట్రంప్నకు సెనేట్ షాక్.. అధ్యక్షుడి ప్రాతిపాదనకు ఎదురుదెబ్బ
-
Hyderabad Traffic : వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ రూట్లలో నో ఎంట్రీ.!
ట్రెండింగ్
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!