Andhra Pradesh: జూన్లో అమ్మ ఒడి.. జూలైలో జగనన్న విద్యాకానుక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యాశాఖపై గురువారం మధ్యాహ్నం క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా అమ్మ ఒడికి బదులుగా ల్యాప్ టాప్ ఆప్షన్ను 8.21 లక్షల మంది విద్యార్థులు ఎంచుకున్నారని అధికారులు సీఎం జగన్కు వివరించారు. నాడు-నేడులో భాగంగా ఇప్పటి వరకు 33వేల అదనపు తరగతులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. సుమారు 23,975 స్కూళ్లలో నాడు-నేడు రెండో దశ కింద పనులు జరుగుతున్నాయని.. నెల రోజుల్లోగా నూటికి నూరు శాతం రెండో దశ కింద చేపట్టనున్న అన్ని స్కూళ్లలో పనులు ప్రారంభం కావాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.
టీఎంఎఫ్, ఎస్ఎంఎఫ్, గోరుముద్ద కార్యక్రమాలపై అధికారులు మరింత శ్రద్ధ పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆయా కార్యక్రమాలను సమర్ధవంతంగా, నాణ్యతతో అమలు చేయాలని, అప్పుడే ఆశించిన లక్ష్యాలను చేరుకుంటామని తెలిపారు. గతంలో రాష్ట్రంలో సుమారు 400 జూనియర్ కళాశాలలు మాత్రమే ఉండేవి అని.. కానీ ఈరోజు ఏకంగా 1200 జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. బాలికలకు ప్రత్యేకంగా మండలానికి ఒక జూనియర్ కళాశాల లేదా కేజీబీవీ లేదా హైస్కూల్ ప్లస్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ విషయం అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. తద్వారా వీటిని బాలికలు వినియోగించుకునే అవకాశాలు మెరుగుపడతాయని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, బాత్రూమ్ల నిర్వహణ వంటివి సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. దీని కోసం పక్కాగా ఎస్ఓపీలు ఉండాలని సీఎం జగన్ సూచించారు. అటు జగనన్న విద్యాకానుక కిట్ నాణ్యతలో ఎక్కడా రాజీపడొద్దని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కిట్ల పంపిణీకి సర్వం సన్నద్ధంగా ఉండాలన్నారు. జూలై 4 నాటికి జగనన్న విద్యాకానుక ప్రారంభానికి సకలం సన్నద్ధం చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు.
Also Read
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
మరోవైపు జూన్లో అమ్మ ఒడి నిధులు పంపిణీ చేసేలా అధికారులు సన్నద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఇంగ్లీష్లో మంచి ప్రావీణ్యం సంపాదించిన బెండపూడి విద్యార్ధులను సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. బెండపూడి హైస్కూల్ ఇంగ్లీషు టీచర్ ప్రసాద్ పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించిన బోధనా విధానాన్ని ఎస్ఓపీగా రూపొందించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో అన్ని స్కూళ్లలో ఈ తరహా లెర్నింగ్ విధానాన్ని ప్రవేశపెట్టేలా చూడాలన్నారు. ఫొనిటిక్స్పై ప్రస్తుతం రీసెర్చ్ చేస్తున్న వారిని ఇందులో భాగస్వామ్యులను చేయాలన్నారు. ఇంగ్లీష్ భాష సమగ్రంగా నేర్చుకోవడంలో యాక్సెంట్, డైలెక్ట్ చాలా ప్రధానమైన అంశాలని సూచించారు. ఈ విషయాలపై అధికారులు ఎక్కువ ఫోకస్ పెట్టాలన్నారు. గూగుల్ రీడ్ ఎలాంగ్ యాప్ ప్రతి టీచర్ మొబైల్లో ఉండేలా చూడాలని సీఎం జగన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Gold & Silver Prices Today: ఇలా అయితే కొనేదెట్టా.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు..
-
Sanju Samson: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం సంజూనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
-
TheParadise : నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రీమియర్స్ ఎప్పుడంటే?
-
AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం…
-
Siya Goyal: పూణే లోహగడ్ కోట హ*త్య కేసు.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!