CM Jagan: చంద్రబాబు దత్తపుత్రుడికి ఆ మాట చెప్పే ధైర్యం ఉందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోనసీమ జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఐ.పోలవరం మండలం మురముళ్లలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేవుడి దయతో ఈరోజు ఓ మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని.. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా ఈ ఏడాది 1,08,755 మంది మత్సకారుల ఖాతాల్లో రూ.109 కోట్లు జమ చేస్తున్నట్లు జగన్ వివరించారు. మత్స్యకార భరోసా కింద ఇప్పటి వరకు రూ.418 కోట్ల సాయం చేశామని తెలిపారు. చంద్రబాబు పాలనలో మత్స్యకారులను పట్టించుకోలేదని జగన్ ఆరోపించారు. ప్రజలు గత ప్రభుత్వ పాలనకు.. ఈ ప్రభుత్వ పాలనకు తేడా గమనించాలని కోరారు.
Rajya Sabha: వైసీపీ నుంచి రేసులో ఉన్నది వీళ్లేనా?
Also Read
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
చంద్రబాబు ఐదేళ్లలో మత్స్యకారులకు ఇచ్చింది రూ.104 కోట్లు మాత్రమేనని.. కానీ ఈరోజు మన ప్రభుత్వంలో ఏడాదికి రూ.109 కోట్లు ఇస్తున్నట్లు జగన్ తెలిపారు. వేటకు వెళ్లి మత్స్యకారుడు ప్రమాదవశాత్తూ చనిపోతే వచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచినట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలో కొత్తగా 9 ఫిషింగ్ హార్బర్లు, 4 ఫిషింగ్ ల్యాండింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ వివరించారు. ఏపీలో మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరిగేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. తాము ప్రజలకు మంచి చేశామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదని.. చంద్రబాబు ఇంత మంచి పని చేశాడని చెప్పే ధైర్యం దత్తపుత్రుడికి లేదని జగన్ ఆరోపించారు. మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని వీరు జీర్ణించుకోలేరని ఎద్దేవా చేశారు. పరీక్షల పేపర్లు వీళ్లే లీక్ చేస్తారని.. మళ్లీ వీళ్లే రాజకీయం చేస్తారని.. అసలు పేపర్ లీక్ను సమర్థించిన ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశారా అని జగన్ ప్రశ్నించారు. అటు ఈఎస్ఐలో డబ్బులు కొట్టేసిన నాయకుడిని విచారించడానికి వీలు లేదనే ప్రతిపక్షం, ఎల్లోమీడియాను ఎక్కడైనా చూశారా అని నిలదీశారు. తాము 2019 మేనిఫెస్టోలో చెప్పిన 95 శాతం హామీలను ఇప్పటికే నెరవేర్చామని జగన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Kitchen Hacks: గ్యాస్ బర్నర్లు నల్లగా మారిపోయాయా? ఇలా చేస్తే నిమిషాల్లో కొత్త వాటిలా మెరిసిపోతాయి!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
-
PF Money: ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ విషయంలో ఈ తప్పు చేస్తే భారీ నష్టం తప్పదు!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
-
TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!