CM Chandrababu : బస్సు ప్రమాదాలు, తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- బస్సు ప్రమాదాలు, తొక్కిసలాట ఘటనలపై సీఎం చంద్రబాబు ఆవేదన
- టెక్నాలజీ ద్వారా ప్రమాదాల నివారణపై ముఖ్యమంత్రి సూచన
- బస్సు రిజిస్ట్రేషన్లలో పాలసీ లోపాలపై విమర్శ
- క్రౌడ్ మేనేజ్మెంట్, రెగ్యూలేటరీ అథారిటీ బలోపేతంపై దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu : రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న బస్సు ప్రమాదాలు, తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా విషాదాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. “ఇలాంటి ప్రమాదాలు జరగకుండా టెక్నాలజీని వినియోగించుకోవాలి. టెక్నాలజీ అందుబాటులో ఉంటే కనీసం కొంతవరకు ప్రమాదాలను అరికట్టవచ్చు” అని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సు ఇటీవల జరిగిన ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ, దానికి సంబంధించి ఉన్న సాంకేతిక, పాలసీ లోపాలపై దృష్టి సారించారు.
“కేంద్రం బస్సులకు నేషనల్ పర్మిట్ ఇస్తోంది. కానీ చనిపోయిన వారు తెలుగువారు, ప్రమాదం జరిగిన స్థలం ఆంధ్రప్రదేశ్లో, వాహనం రిజిస్ట్రేషన్ ఒడిశాలో, ఆపరేషన్ తెలంగాణ నుంచి, గమ్యం కర్ణాటకలో.. ఇలాంటి పరిస్థితుల్లో దీనిని ఎలా చూడాలి?” అని సీఎం ప్రశ్నించారు. కొన్ని రాష్ట్రాలు నామమాత్రపు ఫీజుతో రిజిస్ట్రేషన్లు జారీ చేస్తున్నాయని, ఆ వాహనాలు దేశమంతా తిరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “ఈ పాలసీల్లో ఉన్న లోపాలను చర్చించకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి,” అని స్పష్టం చేశారు.
Also Read
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
అలాగే ఇటీవల తెలంగాణలో ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో అనేక ప్రాణనష్టాలు సంభవించాయని గుర్తు చేశారు. “మన రాష్ట్రంలో కూడా కాశీబుగ్గలో కొత్త ఆలయ ప్రారంభోత్సవానికి భారీ జనసందోహం వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగింది. తొమ్మిది మంది మరణించారు. క్రౌడ్ మేనేజ్మెంట్లో ఎందుకు లోపం జరిగింది? అక్కడి సీఐ, ఎస్సైకి ఈ విషయం తెలియకుండా ఎలా ఇంత పెద్ద సంఘటన జరిగింది?” అని ఆయన ప్రశ్నించారు.
ఇలాంటి ఘటనలు జరగకుండా సమర్థవంతమైన రెగ్యూలేటరీ అథారిటీ అవసరమని సీఎం స్పష్టం చేశారు. “విశాఖ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో నిరుపేదలు ప్రాణాలు కోల్పోయారు. ఒకసారి ఘటన జరిగాక మళ్లీ జరగకూడదు. కానీ జరుగుతున్నాయి… మరి ఎస్ఓపీ (Standard Operating Procedures)లు ఏమైపోయాయి?” అని ప్రశ్నిస్తూ, ప్రతి శాఖ సమన్వయంతో పని చేసి ప్రజల భద్రతను నిర్ధారించాలన్నారు.
Andhra pradesh: SRM యూనివర్సిటీలో ఫుడ్ పాయిజనింగ్పై ఏపీ ప్రభుత్వం సీరియస్
తాజావార్తలు
-
Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!