Yogi Government: సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం సారూ.. 68 వేల మంది ఉద్యోగులకు ‘నో శాలరీ’..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Government: ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మార్చడానికి కృషి చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఆస్తి వివరాలను కోరింది. కొందరు వివరాలను సమర్పించగా, 68 వేల మంది ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాన్ని పట్టించుకోలేదు. దీంతో సుమారు 68 వేల మంది ఉద్యోగుల జీతాలను యూపీ ప్రభుత్వం నిలిపివేసింది.
READ ALSO: Jogi Ramesh: ఏం తప్పు చేశానని నా ఇంటిపై దాడి చేశారు.. జోగి రమేష్ ఫైర్
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
ఈ ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను అందించే వరకు వారికి జీతాలు చెల్లించకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత ఉద్యోగులందరు త్వరలో వారి ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి అందిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 1956 ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమాలలోని 24వ నిబంధన ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 8,66,261 మంది ఉద్యోగులు ఉన్నారు. వారందరూ 2025 సంవత్సరం వరకు తమ చరాస్తులు, స్థిరాస్తుల వివరాలను ఈ ఏడాది జనవరి 31 నాటికి మానవ్ సంపద పోర్టల్లో సమర్పించాలి. ఇప్పటికే అన్ని విభాగాల నోడల్ అధికారులు, చెల్లింపు అధికారులకు ప్రభుత్వం తగిన సూచనలు జారీ చేసింది. జనవరి 31 నాటికి ఆస్తి వివరాలను అప్లోడ్ చేయని వారి జీతాలను కూడా నిలిపివేస్తామని ముందే స్పష్టం చేసింది.
ఈ ఉత్తర్వు అందిన తర్వాత కూడా, శనివారం రాత్రి వరకు 68,236 మంది రాష్ట్ర ఉద్యోగులు మానవ్ సంపద పోర్టల్లో వారి ఆస్తుల వివరాలను అప్లోడ్ చేయలేదని సమాచారం. ఆస్తి వివరాలను అందించని వారిలో అత్యధికంగా 34,926 మంది ఉద్యోగులు మూడవ వర్గానికి చెందినవారే. వీరితో పాటు, 22,624 మంది ష్ట్ర ఉద్యోగులు క్లాస్ IV కి చెందిన వారు ఉండగా, 7204 మంది క్లాస్ II, 2628 మంది క్లాస్ I అధికారులు ఉన్నారని పలు నివేదికలు వెల్లడించాయి. అలాగే 1612 మంది ఇతర ఉద్యోగులలో, 854 మంది తమ ఆస్తులను ప్రకటించలేదు, దీంతో వారి జీతాలను యోగి సర్కార్ నిలిపివేసిందని సమాచారం. శనివారం వరకు తమ ఆస్తుల గురించి సమాచారం ఇవ్వని మొత్తం ఉద్యోగులలో ఎనిమిది శాతం మంది పబ్లిక్ వర్క్స్, రెవెన్యూ, బేసిక్, సెకండరీ ఎడ్యుకేషన్, సోషల్ వెల్ఫేర్, ఉమెన్ వెల్ఫేర్, కోఆపరేటివ్, ఎక్సైజ్, ఫుడ్ లాజిస్టిక్స్, మెడికల్ ఎడ్యుకేషన్, హెల్త్, రూరల్ ఇంజినీరింగ్, హార్టికల్చర్, పశుసంవర్ధక, రవాణా శాఖ మొదలైనవి శాఖలకు చెందిన వారు ఉన్నారు. ఆస్తి వివరాలు ఇవ్వని ఉద్యోగులకు ఫిబ్రవరిలో జనవరి జీతం అందదని వార్తలు వస్తున్నాయి.
READ ALSO: Health Tips: అన్నం Vs చపాతీ.. డయాబెటిస్ పేషెంట్స్కు ఏది మేలు? వైద్యులు చెబుతున్నది ఇదే!
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..