CM Chandrababu : బస్సు ప్రమాదాలు, తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- బస్సు ప్రమాదాలు, తొక్కిసలాట ఘటనలపై సీఎం చంద్రబాబు ఆవేదన
- టెక్నాలజీ ద్వారా ప్రమాదాల నివారణపై ముఖ్యమంత్రి సూచన
- బస్సు రిజిస్ట్రేషన్లలో పాలసీ లోపాలపై విమర్శ
- క్రౌడ్ మేనేజ్మెంట్, రెగ్యూలేటరీ అథారిటీ బలోపేతంపై దృష్టి
CM Chandrababu : రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న బస్సు ప్రమాదాలు, తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా విషాదాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. “ఇలాంటి ప్రమాదాలు జరగకుండా టెక్నాలజీని వినియోగించుకోవాలి. టెక్నాలజీ అందుబాటులో ఉంటే కనీసం కొంతవరకు ప్రమాదాలను అరికట్టవచ్చు” అని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సు ఇటీవల జరిగిన ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ, దానికి సంబంధించి ఉన్న సాంకేతిక, పాలసీ లోపాలపై దృష్టి సారించారు.
“కేంద్రం బస్సులకు నేషనల్ పర్మిట్ ఇస్తోంది. కానీ చనిపోయిన వారు తెలుగువారు, ప్రమాదం జరిగిన స్థలం ఆంధ్రప్రదేశ్లో, వాహనం రిజిస్ట్రేషన్ ఒడిశాలో, ఆపరేషన్ తెలంగాణ నుంచి, గమ్యం కర్ణాటకలో.. ఇలాంటి పరిస్థితుల్లో దీనిని ఎలా చూడాలి?” అని సీఎం ప్రశ్నించారు. కొన్ని రాష్ట్రాలు నామమాత్రపు ఫీజుతో రిజిస్ట్రేషన్లు జారీ చేస్తున్నాయని, ఆ వాహనాలు దేశమంతా తిరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “ఈ పాలసీల్లో ఉన్న లోపాలను చర్చించకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి,” అని స్పష్టం చేశారు.
Also Read
- AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు సీరియస్.. మాకే అధికారముంటే ఈ క్షణాన్నే సస్పెండ్..!
- MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
- AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
అలాగే ఇటీవల తెలంగాణలో ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో అనేక ప్రాణనష్టాలు సంభవించాయని గుర్తు చేశారు. “మన రాష్ట్రంలో కూడా కాశీబుగ్గలో కొత్త ఆలయ ప్రారంభోత్సవానికి భారీ జనసందోహం వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగింది. తొమ్మిది మంది మరణించారు. క్రౌడ్ మేనేజ్మెంట్లో ఎందుకు లోపం జరిగింది? అక్కడి సీఐ, ఎస్సైకి ఈ విషయం తెలియకుండా ఎలా ఇంత పెద్ద సంఘటన జరిగింది?” అని ఆయన ప్రశ్నించారు.
ఇలాంటి ఘటనలు జరగకుండా సమర్థవంతమైన రెగ్యూలేటరీ అథారిటీ అవసరమని సీఎం స్పష్టం చేశారు. “విశాఖ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో నిరుపేదలు ప్రాణాలు కోల్పోయారు. ఒకసారి ఘటన జరిగాక మళ్లీ జరగకూడదు. కానీ జరుగుతున్నాయి… మరి ఎస్ఓపీ (Standard Operating Procedures)లు ఏమైపోయాయి?” అని ప్రశ్నిస్తూ, ప్రతి శాఖ సమన్వయంతో పని చేసి ప్రజల భద్రతను నిర్ధారించాలన్నారు.
Andhra pradesh: SRM యూనివర్సిటీలో ఫుడ్ పాయిజనింగ్పై ఏపీ ప్రభుత్వం సీరియస్
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!