CM Chandrababu : బస్సు ప్రమాదాలు, తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- బస్సు ప్రమాదాలు, తొక్కిసలాట ఘటనలపై సీఎం చంద్రబాబు ఆవేదన
- టెక్నాలజీ ద్వారా ప్రమాదాల నివారణపై ముఖ్యమంత్రి సూచన
- బస్సు రిజిస్ట్రేషన్లలో పాలసీ లోపాలపై విమర్శ
- క్రౌడ్ మేనేజ్మెంట్, రెగ్యూలేటరీ అథారిటీ బలోపేతంపై దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu : రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న బస్సు ప్రమాదాలు, తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా విషాదాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. “ఇలాంటి ప్రమాదాలు జరగకుండా టెక్నాలజీని వినియోగించుకోవాలి. టెక్నాలజీ అందుబాటులో ఉంటే కనీసం కొంతవరకు ప్రమాదాలను అరికట్టవచ్చు” అని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సు ఇటీవల జరిగిన ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ, దానికి సంబంధించి ఉన్న సాంకేతిక, పాలసీ లోపాలపై దృష్టి సారించారు.
“కేంద్రం బస్సులకు నేషనల్ పర్మిట్ ఇస్తోంది. కానీ చనిపోయిన వారు తెలుగువారు, ప్రమాదం జరిగిన స్థలం ఆంధ్రప్రదేశ్లో, వాహనం రిజిస్ట్రేషన్ ఒడిశాలో, ఆపరేషన్ తెలంగాణ నుంచి, గమ్యం కర్ణాటకలో.. ఇలాంటి పరిస్థితుల్లో దీనిని ఎలా చూడాలి?” అని సీఎం ప్రశ్నించారు. కొన్ని రాష్ట్రాలు నామమాత్రపు ఫీజుతో రిజిస్ట్రేషన్లు జారీ చేస్తున్నాయని, ఆ వాహనాలు దేశమంతా తిరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “ఈ పాలసీల్లో ఉన్న లోపాలను చర్చించకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి,” అని స్పష్టం చేశారు.
Also Read
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
అలాగే ఇటీవల తెలంగాణలో ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో అనేక ప్రాణనష్టాలు సంభవించాయని గుర్తు చేశారు. “మన రాష్ట్రంలో కూడా కాశీబుగ్గలో కొత్త ఆలయ ప్రారంభోత్సవానికి భారీ జనసందోహం వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగింది. తొమ్మిది మంది మరణించారు. క్రౌడ్ మేనేజ్మెంట్లో ఎందుకు లోపం జరిగింది? అక్కడి సీఐ, ఎస్సైకి ఈ విషయం తెలియకుండా ఎలా ఇంత పెద్ద సంఘటన జరిగింది?” అని ఆయన ప్రశ్నించారు.
ఇలాంటి ఘటనలు జరగకుండా సమర్థవంతమైన రెగ్యూలేటరీ అథారిటీ అవసరమని సీఎం స్పష్టం చేశారు. “విశాఖ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో నిరుపేదలు ప్రాణాలు కోల్పోయారు. ఒకసారి ఘటన జరిగాక మళ్లీ జరగకూడదు. కానీ జరుగుతున్నాయి… మరి ఎస్ఓపీ (Standard Operating Procedures)లు ఏమైపోయాయి?” అని ప్రశ్నిస్తూ, ప్రతి శాఖ సమన్వయంతో పని చేసి ప్రజల భద్రతను నిర్ధారించాలన్నారు.
Andhra pradesh: SRM యూనివర్సిటీలో ఫుడ్ పాయిజనింగ్పై ఏపీ ప్రభుత్వం సీరియస్
తాజావార్తలు
-
EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
-
Uttam Kumar Reddy : కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిపోయింది
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
-
Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
-
Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!