CM Chandrababu: సివిల్ సప్లైస్, ఎక్సైజ్ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష..
- సివిల్ సప్లైస్.. ఎక్సైజ్ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష..
- ధరల నియంత్రణకు వీలైనన్ని మార్గాలు అన్వేషించాలని సీఎం ఆదేశం..
- ఎక్సైజ్ కుంభకోణంపై త్వరలోనే సీఐడీ విచారణకు ఆదేశించాలని ఏపీ సర్కార్ నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: సివిల్ సప్లైస్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ధరల నియంత్రణకు వీలైనన్ని మార్గాలు అన్వేషించాలన్నారు. ఇప్పటికే రెండు విడతలుగా నిత్యావసర ధరలను కంట్రోల్ చేయడం మంచి పరిణామమన్నామని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్ల తర్వాత రైతులకు వీలైనంత త్వరగా డబ్బులు చెల్లించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రేషన్ అక్రమాలపై సమీక్షించారు. కాకినాడ కేంద్రంగా ద్వారంపూడి ఫ్యామ్లీ చేపట్టిన రేషన్ అక్రమాల కేసు పురోగతిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు.
Read Also: Minister Narayana: అమరావతిపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
Also Read
అలాగే, ఎక్సైజ్ శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక అంశాలను ప్రస్తావించారు. నెల రోజుల్లోగా అన్ని మద్యం దుకాణాల వద్దా డిజిటల్ పేమెంట్ల కోసం ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలపై వారంలో నివేదిక ఇవ్వాలని అధికారులకు తెలిపారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎక్సైజ్ కుంభకోణంపై త్వరలోనే సీఐడీ విచారణకు ఆదేశించాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Donald Trump: ఆమె భారతీయురాలా..? నల్లజాతీయురాలా?.. కమలా హారిస్ని ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యలు..
కొత్త మద్యం విధానంపై అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మద్యం తయారీ నుంచి విక్రయం వరకూ ట్రాక్ అండ్ ట్రేస్ పాలసీ తేవాలని సమీక్షలో సీఎం నిర్ణయం తీసుకున్నారు. అలాగే, మద్యం సేకరణకు సంబంధించి కొత్తగా ప్రోక్యూర్మెంట్ పాలసీని అమలు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. అన్ని ప్రముఖ బ్రాండ్లకు మార్కెట్లో అవకాశం ఉండేలా ప్రొక్యూర్ మెంట్ పాలసీ తెచ్చేందుకు యోచిస్తున్నామన్నారు. మద్యం నాణ్యత పైనా కొత్త విధానం తీసుకురావాలన్నారు. బీఐఎస్ తో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ నాణ్యతా ప్రమాణాలు ఉండేలా ఐదు టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!