CM Chandrababu : భారత్ పారిశ్రామిక వృద్ధిలో సీఐఐ పాత్ర కీలకం
- ఢిల్లీలో సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం మోడీ ‘7 విజ్ఞప్తులకు’ పూర్తి మద్దతు ప్రకటించిన సీఎం ఏఐ, సెమీకండక్టర్ల యుగంలో భారత్ దూసుకెళ్తోంది పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం: పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu : దేశ పారిశ్రామిక పురోగతిలో భారత పరిశ్రమల సమాఖ్య (CII) కీలక పాత్ర పోషిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన సీఐఐ వార్షిక వ్యాపార సదస్సు-2026లో పాల్గొన్న ఆయన, భారతదేశ ఆర్థిక వృద్ధి , భవిష్యత్తు సవాళ్లపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుస్థిరమైన పాలన అందిస్తూ, దేశాన్ని ప్రపంచ పారిశ్రామిక పటంలో అగ్రగామిగా నిలబెడుతున్నారని ఆయన ప్రశంసించారు. వినూత్న ఆలోచనలు , స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చని, 1990లలో దేశంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల సత్ఫలితాలను మనం ఇప్పుడు అనుభవిస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలపై పడుతున్న తరుణంలో, భారత్ తన విదేశీ మార్పిడి నిల్వలను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ సూచించిన ‘ఏడు విజ్ఞప్తులకు’ చంద్రబాబు పూర్తి మద్దతు ప్రకటించారు. బంగారం కొనుగోళ్లు వాయిదా వేసుకోవడం, ఇంధన పొదుపు, ప్రజా రవాణాను ప్రోత్సహించడం, సాధ్యమైన చోట వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిని పాటించడం , ఎరువుల వినియోగం తగ్గించి సహజ వ్యవసాయం వైపు మళ్లడం వంటి చర్యలు దేశ ఆర్థిక భద్రతకు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ మార్పులను కేవలం ప్రధాని బాధ్యతగా కాకుండా, ఒక జాతీయ ఉద్యమంలా పారిశ్రామికవేత్తలు , ప్రజలు స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read
- Bhuma Akhila Priya: అహోబిలం అంశంపై స్పందించిన భూమా అఖిలప్రియ.. ‘వాస్తవాలు వెలుగులోకి రావాలి’
- Cheating: కేటుగాళ్లు కంత్రీ స్కెచ్.. ‘తల్లికి వందనం’ డబ్బులు బురిడీ
- Vallabhaneni Vamsi vs Yarlagadda Venkatrao: ఎమ్మెల్యే యార్లగడ్డకు వల్లభనేని లీగల్ నోటీసు
- YS Jagan Srikakulam Visit: వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్..
ప్రస్తుతం ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్లు , క్లీన్ ఎనర్జీ యుగంలో ఉందని, వికసిత్ భారత్-2047 లక్ష్యం దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోందని చంద్రబాబు వివరించారు. భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు ప్రపంచంలోనే ఆదర్శంగా నిలుస్తోందని, ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన స్వర్గధామమని ఆయన పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై పడకుండా కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరిస్తోందని పేర్కొంటూ, పెట్టుబడులను ఆకర్షించడంలో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పద్ధతిని తమ ప్రభుత్వం అనుసరిస్తోందని వెల్లడించారు. భారతదేశం త్వరలోనే ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!