Venkatagiri Poleramma Jathara: వైభవంగా వెంకటగిరి పోలేరమ్మ జాతర.. ప్రధాన ఘట్టం పూర్తి..
- వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టంగా పూర్తి..
- చాకలిమండపంలో అమ్మవారి ప్రతిమకు సాంప్రదాయ పసుపు కుంకుమల సారె సమర్పన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkatagiri Poleramma Jathara: తిరుపతి జిల్లా వెంకటగిరిలోని శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టంగా పూర్తి చేశారు.. చాకలిమండపంలో అమ్మవారి ప్రతిమకు సాంప్రదాయ పసుపు కుంకుమల సారె సమర్పించారు. మిరాశీదారుల సారెతో శ్రీ పోలేరమ్మవారికి అమ్మవారి సేవకులు ప్రాణప్రతిష్ట గావించారు. ఈ ప్రధాన ఘట్టంతో శ్రీ పోలేరమ్మ అమ్మవారు సమగ్రరూపం దాల్చడంతో భక్తజనులకు దర్శనభాగ్యం కలిగింది. అనంతరం ప్రత్యేక పూల రథంలో నడివీధి ఆలయానికి ముగ్గురమ్మల మూలపుటమ్మ బయలుదేరగా, ఈ అమ్మవారి ఉత్సవ శోభాయాత్ర అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా సాగింది. తెల్లవారుజాము సరికి అమ్మవారు నడివీధి ఆలయంలో కొలువుదీరగా, అమ్మవారి సేవకుల ప్రత్యేక పూజలు అనంతరం ఉదయం నుండి భక్తజనులకు దర్శన భాగ్యం కలగనుంది.
Read Also: IND vs BAN: అభిమానులు ఎగిరి గంతేస్తే.. కాన్పూర్ స్టేడియం పరిస్థితి ఏంటి?
Also Read
- Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
- RK Roja: రాజకీయాలంటేనే టెన్షన్.. ఎమ్మెల్యే అయ్యాకే బీపీ, షుగర్ ఎటాక్..!
- Chittoor Mayor Couple Murder Case: మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసు.. మరోసారి కోర్టు సీరియస్.. కలెక్టర్కు కీలక అదేశాలు..
- AP Crime: పేకాటలో బాకీ వివాదం.. స్నేహితుడిని తుపాకీతో కాల్చి చంపిన యువకుడు..
మొత్తంగా.. వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జనజాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తల్లి దీవెనల కోసం పట్టణం భక్తజనసంద్రంగా మారిపోయింది.. జిల్లాతోపాటు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా వెంకటగిరి వాస్తులు స్వస్థలానికి చేరుకున్నారు.. పోలేరమ్మ జాతర సందర్భంగా వెంకటగిరిలోని ప్రతి వీధి కళకళలాడుతోంది. ఇక, ఈ జాతరలో భాగంగా.. ఈ రోజు వేకువజామున అమ్మవారి నిలుపు కార్యక్రమం మొదలైంది.. అమ్మవారి మెట్టినిల్లు నుంచి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో కొలువుదీరుతారు. సాయంత్రం వరకు భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు.. ఇక, సాయంత్రం అమ్మవారికి అత్యంత వైభవంగా నగరోత్సవం నిర్వహిస్తారు. మరోవైపు.. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.. కాగా, రాష్ట్ర పండుగ హోదాలో పోలేరమ్మ జాతర నిర్వహణకు దేవదాయశాఖ ప్రత్యేకంగా నిధులు విడుదల చేసిన విషయం విదితమే.. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెంకటగిరిలో జరిగే శ్రీ పోలేరమ్మ జాతరలో పాల్గొననున్నారు.. ఇక, నేడు ఉదయం 11:00 గంటలకు తిరుపతి జిల్లా, వెంకటగిరిలో పోలేరమ్మ వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు మంత్రి కందుల దుర్గేష్..
తాజావార్తలు
-
Dragon: ‘డ్రాగన్’లో..తారక్ పాత్రపై ప్రశాంత్ నీల్ బిగ్ క్లారిటీ..
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Pulwama Attack: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పుల్వామా దాడి సూత్రధారి.. హమ్జా బుర్హాన్ను కాల్చి చంపిన దుండగులు
-
Ruturaj Gaikwad: “అలా చేసినందుకు నాకేమీ పశ్చాత్తాపం లేదు”.. చెన్నై ఘోర పరాజయంపై కెప్టెన్ రియాక్షన్..
-
Diesel: డీజిల్ కొరత, ధరల పెరుగుదల వేళ శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!