Kanipakam: వినాయకుడి సన్నిధిలో చవితి వేడుక.. 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanipakam: చిత్తూరు జిల్లా కాణిపాకంలో స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక సన్నిధి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విద్యుద్దీపాలతో వినాయకుడు వెలుగుతున్నాడు. రారండోయ్ వేడుక చూద్దాం అంటూ వినాయక చవితి సంబరంతో సందడి నెలకొంది. గణనాథుని ఆలయంలో 21 రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు భద్రత కల్పించడంతోపాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి.
గణనాథుని బ్రహ్మోత్సవం
చిత్తూరు జిల్లా కాణిపాకం దేవస్థానం, సత్య వాకుల సన్నిధి వినాయక చవితి వేడుకలతో భక్తులను ఆకట్టుకుంటోంది. వినాయక చవితి పండుగతో ప్రారంభమై 21 రోజుల పాటు గణనాథుని బ్రహ్మోత్సవాలు జరగనుండగా ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబరు 8 వరకు జరిగే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.అక్టోబర్ 8న తెప్పోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. జ్ఞానదేవుడు విజ్ఞేశ్వరుని దర్శనానికి వచ్చే భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ధ్వజస్థంభంతో పాటు రాజగోపురం ద్వారాలను శుభ్రం చేసి ఆలయాన్ని సిద్ధం చేసి భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలను ఏర్పాటు చేశారు.
Also Read
- Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
- RK Roja: రాజకీయాలంటేనే టెన్షన్.. ఎమ్మెల్యే అయ్యాకే బీపీ, షుగర్ ఎటాక్..!
- Chittoor Mayor Couple Murder Case: మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసు.. మరోసారి కోర్టు సీరియస్.. కలెక్టర్కు కీలక అదేశాలు..
- AP Crime: పేకాటలో బాకీ వివాదం.. స్నేహితుడిని తుపాకీతో కాల్చి చంపిన యువకుడు..
ఆర్జిత సేవల రద్దు
వినాయక చవితి సందర్భంగా అర్ధరాత్రి 12 గంటలకు ఆలయ అర్చకులు దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం మూడున్నర గంటల నుంచి భక్తులకు స్వామివారి సర్వ దర్శనం కల్పించిన దేవస్థానం ఈ మేరకు ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేసింది. వీఐపీల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వికలాంగులు, వృద్ధులు, శిశువుల తల్లుల కోసం ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశారు. కాణిపాకం ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో సర్వాంగ సుందరంగా అలంకరించిన దేవస్థానం యథావిధిగా గణపతి హోమం నిర్వహించనుంది. వినాయక చవితి రోజు గంధం అలంకారంతో దర్శనం ఇవ్వనున్న గణేశుడిని గణేష్ మాలలు ధరించిన భక్తులు దర్శించుకుంటారు. సాయంత్రం భక్తులు పుష్పకవిడి సమర్పిస్తారు. అదే రోజు రాత్రి హంస వాహనంపై గణనాథుడు భక్తులకు దర్శనం ఇచ్చేందుకు వెళ్తుండగా బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు లక్షలాది లడ్డూ ప్రసాదాలను దేవస్థానం సిద్ధం చేసింది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభూ కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకుంటే కష్టాలు తొలగుతాయని, ఆశీస్సులు లభిస్తాయని ఆలయ ఉప ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల భక్తుల విశ్వాసం అన్నారు.
Bus Accident: లోయలో పడిపోయిన బస్సు.. 25 మంది మృతి, 34 మందికి గాయాలు!
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!