Kanipakam: వినాయకుడి సన్నిధిలో చవితి వేడుక.. 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanipakam: చిత్తూరు జిల్లా కాణిపాకంలో స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక సన్నిధి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విద్యుద్దీపాలతో వినాయకుడు వెలుగుతున్నాడు. రారండోయ్ వేడుక చూద్దాం అంటూ వినాయక చవితి సంబరంతో సందడి నెలకొంది. గణనాథుని ఆలయంలో 21 రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు భద్రత కల్పించడంతోపాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి.
గణనాథుని బ్రహ్మోత్సవం
చిత్తూరు జిల్లా కాణిపాకం దేవస్థానం, సత్య వాకుల సన్నిధి వినాయక చవితి వేడుకలతో భక్తులను ఆకట్టుకుంటోంది. వినాయక చవితి పండుగతో ప్రారంభమై 21 రోజుల పాటు గణనాథుని బ్రహ్మోత్సవాలు జరగనుండగా ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబరు 8 వరకు జరిగే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.అక్టోబర్ 8న తెప్పోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. జ్ఞానదేవుడు విజ్ఞేశ్వరుని దర్శనానికి వచ్చే భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ధ్వజస్థంభంతో పాటు రాజగోపురం ద్వారాలను శుభ్రం చేసి ఆలయాన్ని సిద్ధం చేసి భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలను ఏర్పాటు చేశారు.
Also Read
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
ఆర్జిత సేవల రద్దు
వినాయక చవితి సందర్భంగా అర్ధరాత్రి 12 గంటలకు ఆలయ అర్చకులు దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం మూడున్నర గంటల నుంచి భక్తులకు స్వామివారి సర్వ దర్శనం కల్పించిన దేవస్థానం ఈ మేరకు ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేసింది. వీఐపీల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వికలాంగులు, వృద్ధులు, శిశువుల తల్లుల కోసం ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశారు. కాణిపాకం ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో సర్వాంగ సుందరంగా అలంకరించిన దేవస్థానం యథావిధిగా గణపతి హోమం నిర్వహించనుంది. వినాయక చవితి రోజు గంధం అలంకారంతో దర్శనం ఇవ్వనున్న గణేశుడిని గణేష్ మాలలు ధరించిన భక్తులు దర్శించుకుంటారు. సాయంత్రం భక్తులు పుష్పకవిడి సమర్పిస్తారు. అదే రోజు రాత్రి హంస వాహనంపై గణనాథుడు భక్తులకు దర్శనం ఇచ్చేందుకు వెళ్తుండగా బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు లక్షలాది లడ్డూ ప్రసాదాలను దేవస్థానం సిద్ధం చేసింది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభూ కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకుంటే కష్టాలు తొలగుతాయని, ఆశీస్సులు లభిస్తాయని ఆలయ ఉప ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల భక్తుల విశ్వాసం అన్నారు.
Bus Accident: లోయలో పడిపోయిన బస్సు.. 25 మంది మృతి, 34 మందికి గాయాలు!
తాజావార్తలు
-
Rohit Sharma: కాస్త ఆకలి తగ్గింది.. అయినా ప్రపంచకప్లో అతడు తప్పక ఉండాల్సిందే!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
Harish Rao: జూన్ 30, 2025… తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
God Of War : త్రివిక్రమ్తో సినిమా కోసం ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!