Kurnool Bus Accident: డ్రైవర్ అలా చేసి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు.. బాధితుడి ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. అయితే.. ఈ ట్రావెల్స్ బస్సు మూసా పేట్ నుంచి 9.30 కి స్టార్ట్ అయ్యింది. ఆరంఘడ్ చౌరస్తా నుంచి రాత్రి 11గంటల తర్వాత బయలుదేరింది. బస్సులో మొత్తం 40 మంది ఉన్నారు. హైదరాబాద్ నుంచి 30 మంది ప్రయాణికులు బయల్దేరారు. డ్రైవర్, సబ్ డ్రైవర్, క్లీనర్తో కలిపి మొత్తం 43 మంది ఉన్నారు. ఇందులో దాదాపు 20 మంది మృతి చెందినట్లు చెబుతున్నారు. తాజాగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ రామారెడ్డి అనే వ్యక్తి మాట్లాడారు. డ్రైవర్ ప్రయాణికులను అలర్ట్ చేసి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని తెలిపారు.
READ MORE: Deputy CM Pawan Kalyan: మన ప్రథమ బాధ్యత అడవులను కాపాడటం.. పవన్ కల్యాణ్ పిలుపు..
Also Read
హైదరాబాద్లో చికిత్స కోసం వచ్చినట్లు బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామారెడ్డి తెలిపారు.. “బెంగుళూరు లో కూతురు LLB చేస్తోంది.. పాపను చూడటానికి వెళ్తున్నాను.. గాఢ నిద్రలో ఉన్నాను.. ఒక్కసారిగా బస్సులో అరుపులు, కేకలు వినిపించాయి.. లేచి చూసే సరికి బస్సు అంతా దట్టమైన పొగ, మంటలు, ప్రయాణికులు అంతా లాస్ట్ సీట్ వైపు వచ్చారు.. పొగ లో ఏం కనిపించలేదు.. ఎవరో కిటికీలోంచి నన్ను బయటకు లాగారు.. బస్సుకి కొద్ది దూరం వరకు వచ్చాం. కళ్ళ ముందే బస్సు తగలబడిపోయింది. లోపల ఉన్న ప్రయాణికులు కొందరు సజీవ దహనం అయ్యారు… ఎవరో ఇన్నోవా కారులో మమ్మల్ని తీసుకెళ్లి.. కర్నూలు ఆస్పత్రిలో చేర్చారు.. ఉదయం 6 గంటలకు స్పృహ వచ్చింది.. ఇంట్లో వాళ్లకు కాల్ చేసి చెప్పాను.. సేఫ్ గానే ఉన్నాను అని.. బస్సు తగలబడుతుంటే.. పక్క నుంచే ఎన్నో వెహికల్స్ వెళ్ళాయి కానీ.. చూసి చూడనట్టు వెళ్ళిపోయారు.. కొందరు వచ్చి కాపాడారు.. డ్రైవర్, సబ్ డ్రైవర్, క్లీనర్ అసలు అక్కడ కనపడలేదు.. చిన్నగా మంటలు స్టార్ట్ అవగానే మమ్మల్ని అలెర్ట్ చేసి ఉంటే.. ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు..” అని రామారెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!