CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
- సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం పర్యటన..
- నేటి మూడు రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు టూర్..
- అభివృద్ధి, పార్టీ కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యత..
- రూ.3,847 కోట్లతో 12 పరిశ్రమలకు శంకుస్థాపన..
- 23 వేల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమల ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Kuppam Tour: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో విస్తృతంగా పర్యటించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ సీఎం బిజీ షెడ్యూల్ను ఖరారు చేశారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ద్రావిడ విశ్వవిద్యాలయం హెలిప్యాడ్కు చేరుకోనున్న ఆయన, అనంతరం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
గుడుపల్లి మండలంలోని పొగురుపల్లిలో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. అలాగే రూ.3,847 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న 12 పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పరిశ్రమల ద్వారా సుమారు 23 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు అధికారులు తెలిపారు. అదనంగా రూ.1,026 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న ఆరు పరిశ్రమలకు సంబంధించి సీఎం సమక్షంలో ఎంఓయూలు కుదరనున్నాయి.
Also Read
- MLA Jagan Controversy: మరో వివాదంలో ఎమ్మెల్యే జగన్.. చిత్తూరులో హైటెన్షన్ రాజకీయాలు
- MLA Jagan: కన్నడిగులపై నాకు గౌరవం ఉంది.. ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించండి..
- MLA Jagan: 'బెంగళూరును ఏలుతున్నాం' వ్యాఖ్యలపై దుమారం.. ఎమ్మెల్యే జగన్పై కన్నడ సంఘాల ఆగ్రహం
- Nara Bhuvaneswari Emotional: ద్రౌపది నుంచి నేటి రాజకీయాల వరకు.. కుప్పంలో నారా భువనేశ్వరి ఎమోషనల్ స్పీచ్..
పొగురుపల్లిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం అబీస్ ప్రోటీన్స్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ను ప్రారంభించడంతో పాటు 200 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నారు. అలాగే 28 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధిపై చర్చించనున్నారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కోసం ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్లాంట్లను ప్రారంభించనున్నారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద నిర్మించిన 5,179 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. మొత్తం మీద సీఎం మూడు రోజుల కుప్పం పర్యటనలో అభివృద్ధి, పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పన, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేయనున్నారు.
తాజావార్తలు
-
Varanasi: మహేష్ బాబు బర్త్డే రోజు రాజమౌళి ఎందుకు సైలెంట్? ‘వారణాసి’పై జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
-
AR Ameen: రెహమాన్ కొడుక్కి తృటిలో తప్పిన ముప్పు!
-
SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్ల సమర్పణ.. 60 శాతం నమోదు..
-
AAA Vizag : వైజాగ్ AAA స్క్రీన్ స్పెసిఫికేషన్స్ వేరే లెవెల్ అంతే!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!