CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
- సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం పర్యటన..
- నేటి మూడు రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు టూర్..
- అభివృద్ధి, పార్టీ కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యత..
- రూ.3,847 కోట్లతో 12 పరిశ్రమలకు శంకుస్థాపన..
- 23 వేల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమల ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Kuppam Tour: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో విస్తృతంగా పర్యటించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ సీఎం బిజీ షెడ్యూల్ను ఖరారు చేశారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ద్రావిడ విశ్వవిద్యాలయం హెలిప్యాడ్కు చేరుకోనున్న ఆయన, అనంతరం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
గుడుపల్లి మండలంలోని పొగురుపల్లిలో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. అలాగే రూ.3,847 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న 12 పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పరిశ్రమల ద్వారా సుమారు 23 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు అధికారులు తెలిపారు. అదనంగా రూ.1,026 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న ఆరు పరిశ్రమలకు సంబంధించి సీఎం సమక్షంలో ఎంఓయూలు కుదరనున్నాయి.
Also Read
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
పొగురుపల్లిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం అబీస్ ప్రోటీన్స్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ను ప్రారంభించడంతో పాటు 200 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నారు. అలాగే 28 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధిపై చర్చించనున్నారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కోసం ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్లాంట్లను ప్రారంభించనున్నారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద నిర్మించిన 5,179 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. మొత్తం మీద సీఎం మూడు రోజుల కుప్పం పర్యటనలో అభివృద్ధి, పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పన, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేయనున్నారు.
తాజావార్తలు
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!