ఏపీ విద్యుత్ సంక్షోభం లోకి వెళ్లబోతుంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్మకానికి భారత దేశం ఉందని… వేలకోట్ల పెట్టి విమానాలు కొని తిరుగుతున్నారు మొట్టమొదటి ప్రధాని మోడీ అని మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకానికి పెట్టారు మొట్టమొదటి ప్రధాని మోడీ. క్యాబినెట్ సమావేశనికి ఆలస్యంగా వస్తారు కానీ ఏఒక్క మంత్రి గొంతు వినపడదు. చివరకు విద్యుత్ డిస్కంలు అమ్మకానికి పెట్టిన ఘనుడు ఆయన అన్నారు. దేశంలో గడ్డుకాలం నడుస్తుంది.. రైతులను జీపులతో గుద్ది చంపించారు అని తెలిపారు.
ఇక ఏపీలో విద్యుత్ సంక్షోభం లోకి వెళ్లబోతుంది అని తెలిపారు. నవరత్నాల పేరుతో పేదల నవరంధ్రాలు మూసివేస్తున్నాడు ముఖ్యమంత్రి జగన్. విద్యార్థులకు స్కాలర్షిప్ లు లేవు చదువుకోవాలంటే పేదవిద్యార్ధి అష్టకష్టాలు పడుతున్నారు. త్వరలోనే విద్యార్థుల ఆత్మహత్యలు ప్రారంభమవుతాయి. అందుకే 80లక్షల విద్యార్ద్యులకు స్కాలర్షిప్స్ నవంబర్1వ తారికు లోపల ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేకమంది రాజకీయ నాయకులు స్కాలర్షిప్ లతో చదుకున్నవారు కోకొల్లలు. పేదవాడికి అన్యాయం జరుగుతుంది సంపన్నులకు బీజేపీ కొమ్ముకాస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సి ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆదాని అభివృద్ధి కాదు పేదల అభివృద్ధి కావాలి. చంద్రబాబు తొందరబాబుగా మారారు. రాజధాని మహిళా రైతుల కన్నీళ్లతో ఈ ప్రభుత్వం సర్వనాశనం అవుతుంది. రాజధాని రైతులకోసం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కట్టుబడి పనిచేస్తుంది. ప్రతి దళిత క్రిస్టియన్ కు ఎస్సి స్టేటస్ వచ్చేవిదంగా పోరాటం చేస్తాం. రాజధాని రైతులకోసం రాహుల్ గాంధీని తీసుకువస్తాం. 1990లో డిసెంబర్ నెలలోనే ఏపీని విభజించారు అది ఎవ్వరికీ తెలియదు. విభజన తరువాత కాంగ్రెస్ మీద అపవాదు వేశారు, కానీ విభజన కారకులు మాత్రం హీరోల్లాగా తిరుగుతున్నారు. దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ శ్రీరామ రక్షగా ఉంటుంది అని పేర్కొన్నారు.
Also Read
- Free Coaching: ఫీజు సున్నా.. ఉద్యోగం పక్కా! నిరుద్యోగులకు APCRDA శుభవార్త..
- Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..
- CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు..
- AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు.. ఫోటో ఓటర్ల జాబితాలపై ఎస్ఈసీ కీలక నోటిఫికేషన్
- Tags
- Andhra Pradesh
- bjp
- chinta mohan
- tdp
- ycp
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!