CM Revanth Reddy : హైడ్రా రద్దే లేదు.. కబ్జాదారులను వదిలేది లేదు.. సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్
- హైడ్రా సంస్కరణపై సీఎం రేవంత్ స్పష్టత
- కోర్టు ధిక్కరణ కేసులపై కీలక వ్యాఖ్యలు
- బడా బాబుల ఆక్రమణలే హైడ్రా టార్గెట్
- హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వ సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : హైడ్రా (HYDRAA) వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా స్పందించారు. చెరువులు, నాలాలు, పార్కులు , ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న కబ్జాదారులు తప్పుడు పత్రాలతో న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణల్లో హైడ్రా ఒకటని, దానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయని స్పష్టం చేశారు.
కోర్టు ధిక్కరణ కేసులు కొత్తేమీ కాదు
అధికారులపై కోర్టు ధిక్కరణ (Contempt) కేసులు రావడంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పై ఏకంగా 400 కోర్టు ధిక్కరణ కేసులు ఉండేవి అని, ఆనాడు దీనిపై ఎవరూ మాట్లాడలేదని గుర్తుచేశారు. కంటెంట్ కేసులు పడినంత మాత్రాన అధికారులను మార్చాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఒక అధికారిని ఎక్కడ నియమించాలి, ఎలాంటి బాధ్యతలు అప్పగించాలనేది ప్రభుత్వ విచక్షణ అధికారమని, ఆ విచక్షణారాహిత్యాన్ని ఎవరూ గుంజుకోలేరని స్పష్టం చేశారు. తప్పుడు కేసుల విషయంలో తమకు న్యాయస్థానాలపై సంపూర్ణ విశ్వాసం ఉందని, వాటిని చట్టపరంగానే ఎదుర్కొంటామని తెలిపారు.
Also Read
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
- Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
- Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
- Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
హైడ్రా లక్ష్యం బడా బాబుల ఆక్రమణల తొలగింపే
కబ్జాకోరులు, బిఆర్ఎస్ నేతలు మాత్రమే హైడ్రాను రద్దు చేయాలని అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బతుకమ్మ కుంట లాంటి పవిత్రమైన చెరువులను సైతం గత ప్రభుత్వ నేతలు ఆక్రమించారని ఆరోపించారు. ముఖీమ్ అనే ఒక పెద్ద కబ్జాకోరు నుంచి భూములను ఖాళీ చేయించామని, హైడ్రా చర్యల వల్ల బడా బాబుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. చెరువులు, కుంటలు, నాలాలు , ప్రభుత్వ భూములను కాపాడటమే హైడ్రా పని అని, ఆ పనిని సంస్థ అత్యంత పర్ఫెక్ట్గా నిర్వర్తిస్తోందని ప్రశంసించారు.
సోషల్ మీడియా తప్పుడు ప్రచారంపై ఆగ్రహం
హైడ్రాను నిరోధించడానికి , ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కొందరు డబ్బులు ఇచ్చి మరీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ప్రజలు ఇలాంటి కుట్రలకు సహకరించవద్దని కోరారు. హైడ్రా కార్యాచరణ, అది నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల తమ ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని పునరుద్ఘాటించారు.
కోర్టు ఆదేశాలపై సమీక్షించి ముందడుగు
హైకోర్టు ఇచ్చిన ఆదేశాల కాపీని తాను ఇంకా పూర్తిగా పరిశీలించలేదని, త్వరలోనే ప్రభుత్వపరంగా దీనిపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు. న్యాయస్థానాలంటే తమకు గౌరవం ఉందని, కోర్టు ఆదేశాలను గౌరవిస్తూనే హైడ్రా ద్వారా చేపడుతున్న పర్యావరణ, ప్రభుత్వ భూముల పరిరక్షణ పనులను నిరంతరాయంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
-
Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
-
RC17లో రామ్ చరణ్కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!