Chandrababu: నేను తలుచుకుంటే ఆనాడు జగన్ పాదయాత్ర చేసేవాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. పెద్దూరు వద్ద చంద్రబాబును పోలీసులు అడ్డుకుని నోటీసులు ఇచ్చారు. అయితే డీఎస్పీ ఇచ్చిన నోటీసులను తీసుకునేందుకు చంద్రబాబు నిరాకరించారు. తనకు మైక్ ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోకు చట్టబద్ధత లేదన్నారు. చీకటి జీవోలతో ఎమర్జెన్సీ పాలన తేవాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సీఎం దయాదాక్షిణ్యాలతో సభలు నిర్వహించాలని అనుకుంటున్నారని చురకలు అంటించారు. రోడ్లపై కాకుండా ఆకాశంలో మాట్లాడతారా అని నిలదీశారు. తనను శారీరకంగా, మానసికంగా బాధపెట్టినా తాను భయపడే వ్యక్తిని కాదన్నారు. లోకల్ ఎమ్మెల్యేగా తనకు ప్రజలతో మాట్లాడే హక్కు లేదా అని ప్రశ్నించారు. వైసీపీకి ఒక రూల్, టీడీపీకి ఒక రూల్ ఉంటుందా అని పోలీసులను నిలదీశారు.
Read Also: Gangula Kamalakar : మంత్రి గంగుల కమలాకర్కు పితృవియోగం
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
సైకో సీఎం పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని.. ఆనాడు తాను తలుచుకుంటే జగన్ 365 రోజులు పాదయాత్ర చేసేవాడా అని చంద్రబాబు ప్రశ్నించారు. అందుకే సైకో పాలన పోవాలి.. సైకిల్ పాలన రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 5 కోట్ల మంది ప్రజల తరఫున తాను పోరాటం చేస్తున్నానని చంద్రబాబు అన్నారు. వైసీపీ సభలకు జనం వెళ్లకపోతే పెన్షన్ కట్ చేస్తున్నారని.. తన సభలకు స్వచ్ఛందంగా ప్రజలు తరలివస్తున్నా ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. అయినా రెండో తేదీన జీవో ఇచ్చి 1వ తేదీ నుంచి ఎలా అమలు చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. తన సభలకు వస్తున్న ఆదరణ చూసి జగన్కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. తనను చూస్తే ప్రభుత్వానికి వణుకు పుడుతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. డీజీపీకి చిత్తశుద్ధి ఉంటే బాబాయ్ను గొడ్డలితో ఎవరు నరికి చంపాలో కనిపెట్టాలని అన్నారు. ఇలాంటి పనికిమాలిన దద్దమ్మ, సైకో సీఎంను తన జీవితంలో తొలిసారి చూస్తున్నానని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!