Chandra Babu: 30 ఏళ్లు అధికారంలో ఉండేలా టీడీపీ నేతలు పనిచేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ పర్యటనలో టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన క్రియాశీలక సమావేశంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లే బాధ్యత టీడీపీ కార్యకర్తల భుజస్కంధాలపై ఉందన్నారు. పార్టీలో పని చేసే వాళ్ళకే పదవులు, ప్రజలతో ఉన్న వాళ్ళకే నాయకత్వ అవకాశం దక్కుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే 30 ఏళ్లు అధికారంలో ఉండేలా ఎన్నికల్లో పనిచేయాలని సూచించారు. పార్టీలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజలు పార్టీలో చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీకి ఆర్ధికంగా సహాయం చేసిన వాళ్లకు భవిష్యత్లో మంచి అవకాశాలు ఉంటాయని చంద్రబాబు అన్నారు.
టీడీపీలో ప్రతి కార్యకర్త పనితీరును డిజిటలైజ్ చేస్తామని.. ఇతర సేవలను కూడా డిజిటలైజ్ చేసి భవిష్యత్లో కార్యకర్తలకు అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం పెట్టే కేసులకు ఎవరూ భయపడవద్దని సూచించారు. ఎన్ని కేసులు ఉంటే అంత భవిష్యత్ ఉంటుందనే సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి కేసులన్నీ పరిష్కరించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. మరోవైపు జగన్ రెడ్డి గ్రామానికి ఒక సైకోను తయారు చేశాడని.. ఈ రాజకీయ సైకోలను అణిచివేసే శక్తి, బాధ్యత మనకు ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్రెడ్డిది ఐరన్ లెగ్ అని.. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం దివాళా తీసిందని చంద్రబాబు ఆరోపించారు. కోడికత్తి డ్రామాలు లాంటివి మనం చేయలేదని.. చేయాల్సిన అవసరం కూడా లేదని పేర్కొన్నారు.
Also Read
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
- AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
CM Jagan: టెన్త్ పేపర్లు లీక్ చేసింది శ్రీచైతన్య, నారాయణ కాలేజీ వాళ్లే
తాజావార్తలు
-
Tollywood : అక్టోబర్లో రజనీ vs చిరు vs వెంకీ.. గెలుపెవరిది
-
HP HyperX Omen 16: హెచ్ పీ హైపర్ఎక్స్ ఓమెన్ 16 వాలరెంట్ లిమిటెడ్ ఎడిషన్ గేమింగ్ ల్యాప్టాప్ లాంచ్..
-
Hyderabad: ఘట్కేసర్లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!
-
EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
-
Jupally Krishna Rao: “లెక్క తప్పు ఐతే రాజీనామా చేస్తా”.. కేసీఆర్, కేటీఆర్లకు మంత్రి జూపల్లి సవాల్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!