CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం
- హైదరాబాద్ను మించేలా అమరావతి నిర్మాణం: సీఎం చంద్రబాబు
- విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏపీ ప్రయాణం
- కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు
- స్మార్ట్ టెక్నాలజీతో ప్రపంచ స్థాయి రాజధాని లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అత్యున్నత సాంకేతికతతో, హైదరాబాద్ నగరాన్ని మించేలా ఒక స్మార్ట్ సిటీగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గత ఐదేళ్ల పాలనలో అమరావతిని పూర్తిగా పక్కన పడేశారని, కానీ ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో దానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెనుకబడిందని, వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం కంటే, గత ఐదేళ్లలో జరిగిన నష్టమే అత్యంత దారుణంగా ఉందని, దీనివల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని ఆయన పేర్కొన్నారు. ప్రజల మనోధైర్యం దెబ్బతిన్న అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో.. 2024 ఎన్నికల్లో ప్రజలు 94 శాతం సీట్ల విజయంతో కూటమికి చారిత్రక తీర్పునిచ్చారని గుర్తుచేశారు.
BSNL 485 Plan: మార్చి 31 వరకు BSNL ప్రత్యేక ఆఫర్.. రోజుకు 2.5GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్
Also Read
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
- AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
తెలుగుదేశం, జనసేన , బిజెపి కలిసి ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో అద్భుతంగా పనిచేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. అనేక కారణాల వల్ల 2004లో ఓడిపోయినప్పటికీ, మళ్లీ అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టిందని, 2014-2019 మధ్య కాలంలో తాము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో కుంటుపడిన అభివృద్ధిని మళ్లీ పరుగులు పెట్టిస్తున్నామని, ప్రస్తుతం ఏపీని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు సంక్షేమం , అభివృద్ధిని సమపాళ్లలో అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని అమరావతిని నిర్మించడం ద్వారా ఏపీ భవిష్యత్తును మారుస్తామని చంద్రబాబు నాయుడు ఈ సదస్సులో పునరుద్ఘాటించారు.
10 Million Rial Note: ఇరాన్ 10 మిలియన్ నోట్ విడుదల.. భారత కరెన్సీలో ఆ విలువ ఎంతో తెలుసా..?
తాజావార్తలు
-
Venky Atluri: ఆయన ఎక్కడుంటే అక్కడ డబ్బే.. ఇండస్ట్రీలో ఆ హీరో జడ్జిమెంట్కి తిరుగులేదు!”.
-
Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
-
Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!