CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం
- హైదరాబాద్ను మించేలా అమరావతి నిర్మాణం: సీఎం చంద్రబాబు
- విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏపీ ప్రయాణం
- కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు
- స్మార్ట్ టెక్నాలజీతో ప్రపంచ స్థాయి రాజధాని లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అత్యున్నత సాంకేతికతతో, హైదరాబాద్ నగరాన్ని మించేలా ఒక స్మార్ట్ సిటీగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గత ఐదేళ్ల పాలనలో అమరావతిని పూర్తిగా పక్కన పడేశారని, కానీ ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో దానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెనుకబడిందని, వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం కంటే, గత ఐదేళ్లలో జరిగిన నష్టమే అత్యంత దారుణంగా ఉందని, దీనివల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని ఆయన పేర్కొన్నారు. ప్రజల మనోధైర్యం దెబ్బతిన్న అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో.. 2024 ఎన్నికల్లో ప్రజలు 94 శాతం సీట్ల విజయంతో కూటమికి చారిత్రక తీర్పునిచ్చారని గుర్తుచేశారు.
BSNL 485 Plan: మార్చి 31 వరకు BSNL ప్రత్యేక ఆఫర్.. రోజుకు 2.5GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్
Also Read
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
తెలుగుదేశం, జనసేన , బిజెపి కలిసి ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో అద్భుతంగా పనిచేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. అనేక కారణాల వల్ల 2004లో ఓడిపోయినప్పటికీ, మళ్లీ అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టిందని, 2014-2019 మధ్య కాలంలో తాము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో కుంటుపడిన అభివృద్ధిని మళ్లీ పరుగులు పెట్టిస్తున్నామని, ప్రస్తుతం ఏపీని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు సంక్షేమం , అభివృద్ధిని సమపాళ్లలో అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని అమరావతిని నిర్మించడం ద్వారా ఏపీ భవిష్యత్తును మారుస్తామని చంద్రబాబు నాయుడు ఈ సదస్సులో పునరుద్ఘాటించారు.
10 Million Rial Note: ఇరాన్ 10 మిలియన్ నోట్ విడుదల.. భారత కరెన్సీలో ఆ విలువ ఎంతో తెలుసా..?
తాజావార్తలు
-
Karnataka: కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి.. కేరళ కథ సుఖాంతం.. కర్ణాటకలో మొదలైన అసలు సినిమా!
-
He-Man: హాలీవుడ్ సూపర్ హీరోకి టాలీవుడ్ టచ్.. ‘హీ-మ్యాన్’లో నిఖిల్ పవర్ఫుల్ ఎంట్రీ!
-
Jasprit Bumrah: ఆఫ్ఘనిస్థాన్ సిరీస్కు దూరం.. బుమ్రా రీఎంట్రీపై బీసీసీఐ కీలక అప్డేట్?
-
Kantamaneni Ravi Shankar: పంచభూతాలపై టాలీవుడ్ లో కొత్త సినిమా
-
CM Vijay: సీఎం విజయ్కి షాక్ ఇచ్చిన మిత్రపక్షాలు.. ‘రెండు ఆకుల’ రాజకీయంలో దళపతి వెనకడుగు!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!