CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం
- హైదరాబాద్ను మించేలా అమరావతి నిర్మాణం: సీఎం చంద్రబాబు
- విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏపీ ప్రయాణం
- కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు
- స్మార్ట్ టెక్నాలజీతో ప్రపంచ స్థాయి రాజధాని లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అత్యున్నత సాంకేతికతతో, హైదరాబాద్ నగరాన్ని మించేలా ఒక స్మార్ట్ సిటీగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గత ఐదేళ్ల పాలనలో అమరావతిని పూర్తిగా పక్కన పడేశారని, కానీ ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో దానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెనుకబడిందని, వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం కంటే, గత ఐదేళ్లలో జరిగిన నష్టమే అత్యంత దారుణంగా ఉందని, దీనివల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని ఆయన పేర్కొన్నారు. ప్రజల మనోధైర్యం దెబ్బతిన్న అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో.. 2024 ఎన్నికల్లో ప్రజలు 94 శాతం సీట్ల విజయంతో కూటమికి చారిత్రక తీర్పునిచ్చారని గుర్తుచేశారు.
BSNL 485 Plan: మార్చి 31 వరకు BSNL ప్రత్యేక ఆఫర్.. రోజుకు 2.5GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్
Also Read
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
తెలుగుదేశం, జనసేన , బిజెపి కలిసి ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో అద్భుతంగా పనిచేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. అనేక కారణాల వల్ల 2004లో ఓడిపోయినప్పటికీ, మళ్లీ అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టిందని, 2014-2019 మధ్య కాలంలో తాము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో కుంటుపడిన అభివృద్ధిని మళ్లీ పరుగులు పెట్టిస్తున్నామని, ప్రస్తుతం ఏపీని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు సంక్షేమం , అభివృద్ధిని సమపాళ్లలో అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని అమరావతిని నిర్మించడం ద్వారా ఏపీ భవిష్యత్తును మారుస్తామని చంద్రబాబు నాయుడు ఈ సదస్సులో పునరుద్ఘాటించారు.
10 Million Rial Note: ఇరాన్ 10 మిలియన్ నోట్ విడుదల.. భారత కరెన్సీలో ఆ విలువ ఎంతో తెలుసా..?
తాజావార్తలు
-
Kangana Ranaut : నర్స్లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!