10 Million Rial Note: ఇరాన్ 10 మిలియన్ నోట్ విడుదల.. భారత కరెన్సీలో ఆ విలువ ఎంతో తెలుసా..?
- కొత్త కరెన్సీ నోటును విడుదల చేసిన ఇరాన్..
- భారతీయ కరెన్సీలో ఆ నోటు విలువ రూ.650..
- ద్రవ్యోల్బణంలో కూరుకుపోతున్న ఇరాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ దేశం తన చరిత్రలోనే అత్యంత గరిష్ట విలువ కలిగిన ’10 మిలియన్ రియల్’ బ్యాంక్ నోటును తాజాగా చలామణిలోకి తీసుకువచ్చింది. అక్షరాలా కోటి రియల్స్ అన్నమాట. వినడానికి ఇది చాలా పెద్ద మొత్తంగా అనిపించినా.. దీని అసలు విలువ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మన భారతీయ కరెన్సీలో ఈ నోటు విలువ కేవలం రూ. 650 మాత్రమే. అంటే అమెరికా డాలర్లతో పోలిస్తే దీని విలువ కేవలం 7 డాలర్లు మాత్రమే. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎందుకీ పరిస్థితి వచ్చింది..?
Also Read
- Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
- రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
- 6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
ఇరాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు, సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆంక్షలు ఆ దేశ ఆర్థిక వెన్నుముకను విరిచేశాయి. అక్కడ ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) ఎంతలా పెరిగిపోయిందంటే.. సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువులు కొనాలన్నా సంచుల కొద్దీ నగదును తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఇబ్బందులను తగ్గించడానికి, తక్కువ నోట్లతో ఎక్కువ విలువైన లావాదేవీలు జరపడానికి ప్రభుత్వం ఈ 10 మిలియన్ల నోటును ప్రవేశపెట్టింది.
బ్యాంకుల వద్ద బారులు తీరుతున్న ప్రజలు..
ప్రస్తుత యుద్ధ వాతావరణం నేపథ్యంలో.. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ఇరాన్ ప్రజలు డిజిటల్ పేమెంట్స్ కంటే చేతిలో నగదు ఉంచుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలు ఎక్కడ ఆగిపోతాయోనని భయపడి, ఏటీఎంల వద్ద గంటల తరబడి వేచి ఉండి తమ పొదుపు మొత్తాన్ని విత్ డ్రా చేసుకుంటున్నారు. నగదుకు డిమాండ్ పెరగడం కూడా ఈ కొత్త నోటు విడుదలకు ఒక కారణం.
ద్రవ్యోల్బణం మిగిల్చిన చేదు నిజం..
కాగితం మీద 10 మిలియన్లు అని కనిపిస్తున్నా.. మార్కెట్లోకి వెళ్తే ఆ నోటుతో వచ్చే వస్తువులు మాత్రం చాలా తక్కువ. సామాన్యుడి కొనుగోలు శక్తి పడిపోయింది. ఒకప్పుడు లక్షల్లో ఉండే వస్తువుల ధరలు ఇప్పుడు కోట్లకు చేరుకున్నాయి. ఇది ఒక కొత్త నోటు విడుదల మాత్రమే కాదు.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉందో చెప్పడానికి ఒక నిదర్శనం.
అంతర్జాతీయ ఆంక్షలు, ఆర్థిక నిర్వహణలో లోపాలు వెరసి ఇరాన్ కరెన్సీని ప్రపంచంలోనే అత్యంత బలహీనమైనదిగా మార్చేశాయి. కేవలం లావాదేవీల సౌలభ్యం కోసం పెద్ద నోట్లు తేవడం తాత్కాలిక ఉపశమనమే కానీ.. ధరల పెరుగుదలను అరికట్టలేకపోతే ఆ దేశ ఆర్థిక భవిష్యత్తు మరింత అంధకారంలో పడే ప్రమాదం ఉంది.
తాజావార్తలు
-
Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
-
Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు… రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!