Ambati Rambabu: ఏపీకి ఇచ్చిన రూ. 15 వేల కోట్లు గ్రాంట్ కాదు అప్పు..?
- కేంద్రం ఇచ్చిన రూ. 15 వేల కోట్లు గ్రాంట్ కాదు అప్పు..
- ప్రభుత్వం ఏర్పాడి 2 నెలలు అవ్వకముందే చంద్రబాబు యూటర్న్లు స్టార్ట్..
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ఉత్తమమైనది: అంబటి రాంబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాకముందే చంద్రబాబు యూటర్న్ లు మొదలు పెట్టారు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఒకటి రెండు కాదు అనేక విషయాల్లో యూటర్న్ తీసుకున్నారు.. చంద్రబాబు అబద్ధంలో పుట్టి అబద్దంలోనే జీవిస్తూ ఉంటాడు.. కేంద్రం రూ. 15 వేల కోట్లు గ్రాంట్ అని చంద్రబాబు చెప్పారు.. అయితే అదంతా అప్పే.. కేంద్రం ఇప్పిస్తుంది అనేది వాస్తవం అని ఆయన పేర్కొన్నారు. ఫించన్ కూడా రానున్న రోజుల్లో చాలా మందికి అనర్హుల పేరిట ఏరి వేస్తారు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ చీటింగ్ అని ముందే చెప్పాం.. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు అమలు అంటే భయం వేస్తోంది అంటున్నారు.. ఇలాంటి మాటలు చెబుతున్న చంద్రబాబు మొహం చూస్తే ప్రజలకు రోత పుడుతోంది అని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.
Read Also: Buddy Trailer: యాక్షన్ ఎలెమెంట్స్ తో అదరకొడుతున్న బడ్డీ ట్రైలర్
Also Read
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
ఇక, వైఎస్ జగన్ తెచ్చిన భూముల రీ- సర్వే వల్ల రైతులకు ఇబ్బందని అది తీసేస్తామమని చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పారు అని అంబటి రాంబాబు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల రీ సర్వే ఆపేసి ఎవరైనా ఇబ్బందని చెబితే మాత్రమే సర్వే చేస్తామని సీఎం అంటున్నారు.. ఇంతకీ చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది.. కేంద్రం తెచ్చిన భూముల రీ సర్వేలో భాగంగా మాత్రమే ఏపీలో భూముల రీ సర్వే జరిగింది అని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు. మళ్ళీ రీ సర్వేకు ప్రభుత్వం సిద్ధమవుతూ చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ఉత్తమమైనది.. ఇది జగన్ ఆలోచన కాదు కేంద్రంలో ఉన్న నీతి ఆయాగ్ రాష్ట్రాలకి చెబితే వచ్చింది.. రానున్న రోజుల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను చంద్రబాబు కూడా అమలు చేయాల్సి ఉంటుంది.. అయితే మరో పేరుతో మరో రూపంలో చంద్రబాబు తీసుకురాక తప్పదు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు.
Read Also: Rafale Jets: రాకెట్ దూసుకెళ్తుండగా తోడుగా వెళ్లిన రఫేల్ యుద్ధ విమానాలు.. వీడియో వైరల్
ఇక, అమ్మకు వందనం వచ్చే సంవత్సరం కూడా ఇచ్చే అవకాశం ఉండదని భావిస్తున్నాను అని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. ఇక, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళకు రూ. 1500 ఇచ్చే పథకం వంటి హామీలను తుంగలో తొక్కుతున్నారు.. హామీలు మోసం చేసే వ్యక్తి చంద్రబాబు.. అలాగే, వైసీపీలో నంబర్ టూ అంటూ ఉండరు.. ఆ ప్రశ్నే వైసీపీలో ఉత్పన్నం కాదు.. వైసీపీకి ఏకైక నాయకుడు జగన్ మాత్రమే.. జగన్ వెంటే ఉంటాం..జగన్ చెప్పింది చేయటమే మా పని.. గతంలో అనేక కుట్రలను పార్టీపై చేసినా జగన్ ఛేదించి గెలిచారు అని గుర్తు చేశారు. ఓటమి పాలైనా కూడా పార్టీపై మీ కుట్రలు పని చేయవు.. టీడీపీ పెట్టే తప్పుడు కేసులకు వైసీపీ నేతలు, క్యాడర్ భయ పడదని మాజీమంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!