బద్వేల్ దంగల్.. కేంద్ర మంత్రి మురుగన్ ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 30న జరుగనున్న బద్వేల్ ఉప ఎన్నిక కోసం అధికార వైసీపీ, విపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. బద్వేల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర పశుసంవర్థక, మత్స్య , ప్రసార శాఖ మంత్రి మురుగన్ పాల్గొన్నారు. వైసీపీ పాలనలో బద్వేల్ అభివృద్ధి జరగలేదన్నారు కేంద్ర మంత్రి మురుగన్. అభివృద్ధి ప్రభుత్వం కావాలో.. లిక్కర్ ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలన్నారు. బద్వేల్ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన కేంద్ర పశుసంవర్థక, మత్స్య , ప్రసార శాఖ మంత్రి మురగన్ కడప జిల్లాలో పర్యటించారు. తిరుపతి నుంచి నేరుగా బద్వేల్ కు చేరుకున్న మంత్రి పార్టీ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన వాహనంపై ఎక్కి రోడ్డు షోలో పాల్గొన్నారు.
పార్టీ కార్యాలయం నుంచి నాలుగురోడ్ల కూడలి వరకూ బీజేపీ రోడ్ షో సాగింది. కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్రమంత్రి మురగన్ పాల్గొన్నారు. బద్వేల్ లో గత 40 ఏళ్లుగా వైయస్ ఫ్యామిలీనే పాలకులుగా ఉన్నారన్నారు. అయినా ఏమాత్రం అభివృద్ది జరగలేదన్నారు.
Also Read
వైయస్సార్ సీఎం గా పని చేశారని తరువాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా సీఎంగా ఉన్నా బద్వేల్ లో ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీని కూడా ఏర్పాటు చేయకపోయారన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారన్నారు. అభివృద్ది ప్రభుత్వం కావాలో లిక్కర్ ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలన్నారు. వైసీపీ గెలిస్తే ఆ పార్టీకి మరో ఎమ్మెల్యే వస్తారని కానీ బీజేపీ అభ్యర్తి గెలిస్తే మోడీ సహకారంతో బద్వేల్ ను అభివృద్ది చేస్తారన్నారు. ఎన్నికల ప్రచారం అనంతరం అక్కడి నుంచి పోరుమామిళ్లకు చేరుకున్న మంత్రి అక్కడ ఏర్పాటు చేసి రోడ్ షో లో పాల్గొన్నారు. ఒక వైపు జోరు వర్షం కరుస్తున్నా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ షో లో పాల్గొన్నారు. అక్కడి నుంచి పర్యటన ముగించుకుని మురుగన్ కడపకు వెళ్లారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!