Andhra Pradesh: కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఏపీ ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: కేంద్రమంత్రి దేవుసిన్హ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అతి తక్కువ సమయంలోనే ఏపీ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయిందని కేంద్రమంత్రి దేవుసిన్హ్ చౌహాన్ అన్నారు. గుడ్ గవర్నెన్స్ అందించడంలో సీఎం జగన్ విఫలమయ్యారని.. ప్రస్తుతం ఏపీ ప్రమాదకర పరిస్థితుల్లో ఉందన్నారు. కేంద్ర నిధులు సద్వినియోగం చేసుకోవడంలో జగన్ సమర్ధుడు కాదని విమర్శలు చేశారు. గ్రామీణాభివృద్ధికి 14, 15వ ప్రణాళిక సంఘం నిధులను ప్రభుత్వం వేరే మార్గంలో వాడుకుందని ఆరోపించారు. దీనిపై సర్పంచ్లు తనకు వినతిపత్రాలు ఇచ్చారని చెప్పారు. ఇది గ్రామ స్వరాజ్యంపై దాడిగా చౌహాన్ అభివర్ణించారు.
Read Also: Virat Kohli: చరిత్ర సృష్టించిన కోహ్లీ..ఆ ఘనత సాధించిన ఒకే ఒక్కడు
Also Read
- NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
- 108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- AP Government: భూ కేటాయింపు విధానంలో కీలక సంస్కరణలు.. ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం
- OTR: సాయి కృష్ణ కస్టోడియల్ డె*త్.. హోమ్ మంత్రి ఎందుకు మౌనం?
అటు ఏపీలో ఇకపై ప్రతి నెల ఒక కేంద్రమంత్రి విజిట్ చేస్తారని దేవుసిన్హ్ చౌహాన్ వెల్లడించారు. పంచాయతీలకు ఇచ్చే నిధులు గ్రామాల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు, సిబ్బంది జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. వాలంటీర్లను జీతాలు ఇస్తున్నారని.. కానీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదన్నాడు. వాలంటీలర్లకు ప్రభుత్వ నిధులు పంచుతున్నారని దుయ్యబట్టారు. వాలంటీర్లు సేవ చేయడం లేదని.. ఇతర పార్టీలను అణచి వేసేందుకు వాలంటీర్లను వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యం కాదన్నారు. ప్రభుత్వ విధులు నిర్వహించడంలో వాలంటీర్లు విఫలమవుతున్నారన్నారు.
రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉందని.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ఒక్క సీటు కూడా రాదని కేంద్రమంత్రి దేవుసిన్హ్ చౌహాన్ జోస్యం చెప్పారు. 20 లక్షల గృహాలను కేంద్రం ఏపీకి మంజూరు చేసిందని.. కానీ ఇక్కడ ఒక్క ఇల్లు నిర్మించడం లేదన్నారు. మౌలిక సదుపాయాలు కూడా లేవన్నారు. ఏపీ ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిగా లేరని..కేంద్రం ఏపీ ప్రజలకు మంజూరు చేసే నిధులు సక్రమంగా వినియోగించడం లేదని ఆరోపించారు. ఆయుష్మాన్ కార్డు పేదలకు ఇవ్వడం లేదన్నారు. కేంద్రం చేసిన అభివృద్ధి, రాష్ట్రం చేసిన అభివృద్ధి ప్రజలకు కళ్లముందే కనిపిస్తుందని.. ఏపీలో ప్రతి వ్యక్తికి సాయం చేయడానికి ప్రధాని మోదీ సిద్ధంగా ఉన్నారన్నారు.
తాజావార్తలు
-
Damodar Rajanarsimha: వైద్యుల సేవలు అమూల్యం.. డాక్టర్స్ డే సందర్భంగా మంత్రి కీలక సందేశం
-
Ashwin: ‘వైభవ్ నీళ్లు మోయడం అవమానం కాదు’.. విమర్శకులకు అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్!
-
Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
-
OG 2 Heroine: ‘ఓజీ 2’ హీరోయిన్.. ఇదెక్కడి రచ్చ మామ!
-
Peddi OTT: ‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ వాయిదా? కొత్త స్ట్రీమింగ్ డేట్ ఇదేనా!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!