Nageswara Rao: ఆంధ్రప్రదేశ్ని “వైయస్సార్ ప్రదేశ్”గా మార్చేయండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారం తీవ్ర విధ్వంసానికి దారితీసింది.. అంబేద్కర్ పేరును ఆ జిల్లాకు జోడించడంపై ఓ వర్గం ఆందోళన చేస్తుండగా.. అంబేద్కర్ పేరును కొనసాగించాలంటూ దళితసంఘాలు నిరసనకు దిగుతున్నాయి.. అయితే, ఆంధ్రప్రదేశ్ పేరును కూడా మార్చేయాలంటూ సీబీఐ మాజీ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ మన్నెం నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును “వైయస్సార్ ప్రదేశ్”గా మార్చమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి నా విన్నపం. అంటూ ట్వీట్ చేశారు.. ఇక, తెలుగును ఓ తెగులుగా భావించి దానిని పీకిపారవేస్తున్నాం కాబట్టి.. రాష్ట్రానికి ‘YSR LAND’ అనే ఇంగ్లీష్ పేరు పెడితే భేషుగ్గా ఉంటుందంటూ సెటైర్లు వేశారు.
Read Also: Amalapuram Violence: ఏడు కేసులు నమోదు.. 46 మంది అరెస్ట్..
Also Read
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
అంతేకాదు, ఒకప్పుడు తెలుగు వారి తెలుగు సంభాషణ వింటుంటే తెలుగు వారికి “వాగ్భూషణం భూషణం” అనేది అక్షరాల నిజం అనిపించేది.. కన్యాశుల్కంలో రామప్పంతుల గారితో ఏక వచన ప్రయోగం ఎంతో అసభ్యకరమని గురజాడ అప్పారావు గారు చురక వేసారు.. వారే కనుక ఈ తరంలో పుట్టియుంటే ముమ్మాటికి ఆత్మహత్య చేసుకునేవారు.. అంటూ మరో ట్వీట్ చేశారు నాగేశ్వరరావు.. మొత్తంగా.. సీబీఐ మాజీ డైరెక్టర్ చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారిపోయింది.. ఆయనను సమర్థిస్తూ కొందరు కామెంట్లు పెడుతుంటూ.. ఆయనను టార్గెట్ చేసేవారు కూడా లేకపోలేదు.
https://twitter.com/MNageswarRaoIPS/status/1529317497802878976
ఒకప్పుడు తెలుగు వారి తెలుగు సంభాషణ వింటుంటే తెలుగు వారికి “వాగ్భూషణం భూషణం” అనేది అక్షరాల నిజం అనిపించేది.
కన్యాశుల్కంలో రామప్పంతుల గారితో ఏక వచన ప్రయోగం ఎంతో అసభ్యకరమని గురజాడ అప్పారావు గారు చురక వేసారు.
వారే కనుక ఈ తరంలో పుట్టియుంటే ముమ్మాటికి ఆత్మహత్య చేసుకునేవారు.
— M. Nageswara Rao IPS (Retired) (@MNageswarRaoIPS) May 25, 2022
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం