BV Raghavulu: కొన్ని ప్రతిపక్షాలకు.. బీజేపీకి పెద్దగా తేడా లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ స్థాయిలో విపక్షాలు కేంద్రంపై పోరాడుతూనే ఉన్నాయి.. కానీ, కొన్ని ప్రతిపక్షాలకు.. బీజేపీకి పెద్దగా తేడా లేదన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టేసి.. ఏపీలోని వైసీపీ, టీడీపీలు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు మద్దతిచ్చాయని దుయ్యబట్టారు.. ప్రత్యేక హోదా, విభజన హామీలు సహా చాలా సమస్యలను కేంద్రం పరిష్కరించాల్సి ఉందని గుర్తుచేసిన ఆయన.. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందని వివిధ సందర్భాల్లో వైసీపీ-టీడీపీ కామెంట్లు చేశాయి.. అయినా, ద్రౌపది ముర్ముకు మద్దతిచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రజలపై భారాలు మోపితే కేంద్రం అప్పులు ఇస్తామంటోంది.. దానికి వైసీపీ వంత పాడుతోన్న పరిస్థితి ఉందన్నారు.. కేంద్రం చేసే తప్పిదాలపై వైసీపీ పోరాడకుండా.. బీజేపీ చల్లని నీడ ఉంటే చాలని భావిస్తోందని విమర్శించారు రాఘవులు.
Read Also: Cheating: వీడు మామూలోడు కాదు.. 11 మందితో పెళ్లి.. కొండాపూర్లోనే ఏడు..
Also Read
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం.. 117 కొత్త గేట్ల పనులు ప్రారంభించిన సీఎం!
- APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
- APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. 'చంద్రన్న బోడిగుండు' అంటూ ప్లకార్డులు!
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
ఇక, పోలవరం నిర్వాసితులను వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీవీ రాఘవులు.. పోలవరం గిరిజనులను ఆదుకోవాలని కోరారు.. గతంలో కూడా కేంద్రం వివిధ సందర్భాల్లో నిఘా, దర్యాప్తు సంస్థలను వినియోగించేవి.. కానీ, నరేంద్ర మోడీ సర్కార్ వాటిని మరింత ఎక్కువగా వినియోగిస్తోందని ఆరోపించారు.. మహారాష్ట్ర తరహా సంఘటనలను సృష్టిస్తోందన్న ఆయన.. కానీ, బీజేపీని ఎదుర్కొనే విషయంలో విపక్షాల మధ్య కొంత గ్యాప్ ఉన్న మాట వాస్తవమే అన్నారు. మరోవైపు, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారంపై స్పందించిన రాఘవులు.. స్పీకర్ పదవిలో ఉన్న వాళ్లు పార్టీలకు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు.. చట్టంలో అలాంటి నిబంధన లేదన్నారు.. స్పీకర్ పదవి చేపట్టినా.. పార్టీ సమావేశాలకు హాజరు కావచ్చు.. పార్టీ వేదికలను పంచుకోవచ్చు.. కానీ, స్పీకర్ చైర్లో కూర్చోన్న తర్వాత అన్ని పార్టీలను సమానంగా చూడాలని సూచించారు బీవీ రాఘవులు.
తాజావార్తలు
-
Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
-
Telangana Teachers: తెలంగాణ టీచర్లకు శుభవార్త..
-
Jr NTR: రాజకీయాల్లోకి ఎన్టీఆర్..అసలు విషయం ఇదే!
-
Korean Kanakaraju Teaser: పెనుకొండ నుంచి కొరియా వరకు.. ‘కొరియన్ కనకరాజు’ టీజర్ చూశారా!
-
Tamil Nadu: గోవధ నిషేధంపై విజయ్ సర్కార్కు సుప్రీంకోర్టులో ఊరట
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!