మండపం నుంచి పెళ్లికూతురు పరారీ.. ఆఖరి నిమిషంలో ఆగిన పెళ్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఖరి నిమిషంలో పెళ్లి ఆగిపోయిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగింది.. దీంతో పెళ్లి ఆగిపోయింది.. ఇక, హర్ట్ అయిన పెళ్లి కుమారుడు, ఆ కుటుంబం.. పరువు నష్టం కింద రెండు లక్షల రూపాయలు చెల్లించాలని పోలీసులను ఆశ్రయించారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం హోస్పేటకు చెందిన రామానుజులుతో, తంబళ్లపల్లె కు చెందిన తిరుమల కుమారితో గత జూలై 7న నిశ్చితార్థం జరిగింది.. ఇవాళ ఉదయం మదనపల్లిలో పెళ్లి జరగాల్సి ఉంది.. అయితే, నిన్న రాత్రి కళ్యాణ మండపం నుంచి వధువు తిరుమల కుమారి పరారైంది.
సమీప బంధువులతో పాటు మరో యువకుడితో గత రాత్రి పెళ్లి కూతురు వెళ్లిపోయిందని, ఈ ఉదయం మరో వ్యక్తితో ఆమెకు వివాహం జరిగిందని వరుడి కుటుంబీకులు చెబుతున్నారు.. ఈ ఘటనపై మదనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు వరుడు, వారి కుటుంబీకులు… నమ్మించి తనను మోసం చేశారని, తమకు పరువు నష్టం అని వాపోతున్న వరుడు… అందుకు పరిహారంగా రెండు లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు. వరుడు రామానుజులు ఫిర్యాదు మేరకు ఘటనపై విచారణ జరుపుతున్నారు పోలీసులు.
Also Read
తాజావార్తలు
-
Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు ‘భారతీరాజా’
-
Sleep Disorder : రాత్రి 8 గంటలు నిద్రపోయినా అలసట ఎందుకు పోదు? చాలా మంది తెలుసుకోవాల్సిన నిజాలు!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ben Stokes: చిరకాల సలహాదారుడిని కలుస్తున్న బెన్ స్టోక్స్.. బయపడిపోతున్న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు!
-
Peddi : భారీ నష్టాల దిశగా ‘పెద్ది’ నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకుమించి?
ట్రెండింగ్
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!