Botsa Satyanarayana: తథాస్తు.. చంద్రబాబు కోరిక తప్పకుండా నెరవేరుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana Satires On Chandrababu Comments: తనకు చివరి ఎన్నికలు ఇవేనంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యాలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యంగ్యంగా స్పందించారు. చంద్రబాబు చెప్పినట్టుగా.. ఆయన ‘చివరి’ కోరిక తప్పకుండా నెరవేరుతుందని పేర్కొన్నారు. పైన తథాస్తు దేవతలు ఉంటారని, చంద్రబాబు వ్యాఖ్యలకు ఆ దేవతలు ‘తథాస్తు’ అంటారని అన్నారు. చంద్రబాబుకు ప్రజలు మూడుసార్లు అవకాశం ఇస్తే, అన్నిసార్లు ఆయన మోసం చేశారని విమర్శించారు. ఇకపై చంద్రబాబు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని జోస్యం చెప్పారు. సానుభూతి కోసం అసెంబ్లీలో తన భార్యను కించపరిచారంటూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగానూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో రకంగానూ చంద్రబాబు వ్యవహరించేవారని.. రాష్ట్రం బాగుపడాలంటే, చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాకూడదని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే మాత్రం.. కరువు కాటకాలు తప్పకుండా వస్తాయన్నారు. ఏపీ సీఎం జగన్ను, జగన్ ప్రభుత్వాన్ని చంద్రబాబు ‘హిట్లర్, ఈస్టిండియా కంపెనీ’లతో పోల్చారని.. ఆయన జాలి, దయ లేవని బొత్స మండిపడ్డారు. చంద్రబాబు భార్యను ఎవరు అవమానించారో, అసెంబ్లీలో ఎవరు తప్పుగా మాట్లాడారో నిరూపించాలన్నారు. ఇలా అవమానిస్తే.. ఎవరూ హర్షించలేరని బొత్స వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో.. ఉద్యోగుల సమస్యలపై బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన 11వ పీఆర్సీ వల్ల ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. అందరూ మాట్లాడుకునే పీఆర్సీపై నిర్ణయంపై తీసుకున్నామని, ఇప్పుడు దాని వల్ల నష్టం వచ్చిందని చెప్పడం సరికాదని హితవు పలికారు. ఉద్యోగులు ఇప్పుడు 12వ పీఆర్సీ వేయమని కోరడంలో తప్పులేదన్న ఆయన.. ఏడాదికి 80వేల కోట్లు జీతాల రూపంలో ఖర్చుపెట్టాల్సి వస్తోందన్నారు. కొన్ని సమస్యల విషయంలో ఉద్యోగులు కోర్టుకు వెళుతున్నారని, దీనివల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలు ఎల్లప్పుడూ ఉంటాయని.. అయితే ప్రభుత్వానికి ఉద్యోగుల కంటే రాష్ట్రంలోని ప్రజల సమస్యలే ముఖ్యమని స్పష్టం చేశారు. జగన్ మళ్ళీ సీఎం అవ్వడానికి ఉద్యోగులు కూడా సహకరించండి అంటే.. ఎన్నికల ప్రచారం చేయమని కాదని క్లారిటీ ఇచ్చారు. మనకు కోరికలు అపరిమితమైనవని, తీరే కోరికలు ఉంటే మంచిదని సూచించారు. ప్రభుత్వాలు సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తాయని, ఉద్యోగులు తీరే సమస్యలపైనే ప్రభుత్వానికి డిమాండ్లు చేయాలని బొత్స సత్యనారాయణ సూచించారు.
Also Read
- Rythu Shankaravam: 'రైతు శంఖారావం'కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
తాజావార్తలు
-
Raaz Actress: అప్పుడు దెయ్యంగా భయపెట్టిన నటి.. ఇప్పుడు ఫామ్స్టే నడుపుతూ ప్రశాంత జీవితం..
-
India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్లో కీలక టెస్ట్..
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
-
Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు!
ట్రెండింగ్
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!