India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్లో కీలక టెస్ట్..
- భారత్ మిసైల్ పవర్కు మరో బూస్ట్..
- 2,995 కి.మీ. రేంజ్లో కీలక పరీక్షకు సన్నాహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Missile Test: భారత్ తన రక్షణ, వ్యూహాత్మక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా మరో కీలక అడుగు వేస్తోంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO), స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి మరో కీలక క్షిపణి పరీక్షకు సన్నాహాలు జరుగుతోంది. ఇందుకోసం బంగాళాఖాతం, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుమారు 2,995 కిలోమీటర్ల పరిధికి సంబంధించిన NOTAM (Notice to Airmen)ను అధికారులు జారీ చేశారు.
సెప్టెంబర్ 2, 3 తేదీల్లో పరీక్ష..
తాజా నివేదికల ప్రకారం.. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ఈ క్షిపణి పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరీక్ష సమయంలో విమానాలు, సముద్ర కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా నిర్దిష్ట ప్రాంతాన్ని నో-ఫ్లై జోన్గా ప్రకటించడంతో పాటు సముద్రంలో డేంజర్ కారిడార్ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. NOTAMలో పేర్కొన్న ప్రాంతం దాదాపు 2,995 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండటం ఇప్పుడు ప్రపంచ రక్షణ రంగంలో ఆసక్తిని పెంచుతోంది.
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
ఏ క్షిపణిని పరీక్షించనున్నారంటే..
అయితే ఈ పరీక్షలో ఏ క్షిపణిని ప్రయోగించనున్నారనే విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ, DRDO అధికారికంగా వెల్లడించలేదు. అయితే రక్షణ రంగ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ పరిధి అగ్ని సిరీస్కు చెందిన ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లలో ఒకటైన అగ్ని-3 లేదా అగ్ని-4 పరీక్షకు సంబంధించినదై ఉండొచ్చని అంటున్నారు. అదే సమయంలో తదుపరి తరం అత్యాధునిక క్షిపణిగా ప్రచారంలో ఉన్న అగ్ని-6కు సంబంధించిన పరీక్ష లేదా దాని కీలక భాగాల ట్రయల్ కూడా జరిగే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. అయితే దీనిపై అధికారిక ధ్రువీకరణ లేదు. భారత్ ఇప్పటికే అగ్ని సిరీస్లోని పలు క్షిపణులను విజయవంతంగా అభివృద్ధి చేసి, పరీక్షించింది. దేశ వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాన్ని పెంచడంలో ఈ క్షిపణులు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
తాజాగా 2,995 కిలోమీటర్ల పరిధిలో NOTAM జారీ కావడంతో భారత్ మరో కీలక పరీక్షకు రంగం సిద్ధమవుతోందనే ఊహాగానాలు శత్రు దేశాలతో పాటు ప్రపంచ దేశాల్లో ఊపందుకున్నాయి. మరోవైపు ఈ పరీక్షకు సంబంధించిన క్షిపణి పేరు, దాని సామర్థ్యాలు, ప్రయోగ లక్ష్యాలపై అధికారిక వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ పరీక్ష సక్సెస్ అయితే భారత రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికత, వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఇది మరో ముందడుగుగా నిలిచే అవకాశం ఉందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్లో కీలక టెస్ట్..
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
-
Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!