Botsa Satyanarayana: మంత్రి బొత్స సవాల్.. పవన్ కళ్యాణ్కి ఆ ప్రకటన చేసే దమ్ముందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana Challenges Pawan Kalyan: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్కి ఓ సవాల్ విసిరారు. రాజ్యాధికారం కోసం రెండు పార్టీలతో సంబంధాలు ఉన్నప్పటికీ.. నాయకత్వం మాదేనని ప్రకటించే దమ్ము పవన్ కళ్యాణ్కి ఉందా? అని ఛాలెంజ్ చేశారు. విశాఖపట్నంలో మంత్రి బొత్స మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే తాపత్రయంతోనే ఆయనపై బురదజల్లే ఆలోచనలో పవన్ ఉన్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ది కేవలం ఒక సెలబ్రిటీ పార్టీ అని, మూడ్ వచ్చినప్పుడు మాత్రమే పవన్ మాట్లాడుతుంటారని, ఆయన వైఖరి చూస్తుంటే జాలేస్తుందని చెప్పారు. నిర్దిష్టమైన లక్ష్యం ఉంటే.. నీతి, నిజాయితీతో పోరాడాలని సూచించారు. ఆ విధంగా చేస్తే.. ఏ 30 ఏళ్లకో అవకాశం వస్తుందని, అప్పటివరకు ఎన్ని చేసిన వేస్ట్ అని తేల్చి చెప్పారు.
Kapil Sharma: అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. కపిల్ శర్మ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
రాజకీయాల్లోకి వచ్చాక తాను టాటా బిర్లాల మాదిరిగి ఎదిగిపోయానని పవన్ వ్యాఖ్యానిస్తున్నారని.. వాళ్ల మాదిరి తానెక్కడ ఎదిగిపోయానో పవన్ చెప్పగలరా? అని బొత్స ప్రశ్నించారు. బలహీన వర్గాలకు వైసీపీ ఒక బ్రాండ్ అంబాసిడర్ లాంటి పార్టీ అని వెల్లడించారు. మా ప్రభుత్వానికి, పార్టీకి బీసీలు బ్యాక్ బోన్ అని ముఖ్యమంత్రి బహిరంగంగానే చెప్పారని గుర్తు చేశారు. పక్క రాష్ట్రంలో బీసీలకు జరుతున్న అన్యాయంపై పవన్ ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. తనకంటే ముందే కాపు కులం నుంచి చాలామంది మంత్రులు వచ్చారని చెప్పిన ఆయన.. తాను వ్యక్తిగతంగా ఎంత అభివృద్ధి చెందానో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ అన్యాయం జరిగిందో చెప్పాలని అడిగారు. గంటకో కులం అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని.. కులం, మతం అనేది సమాజంలో ఒక భాగమైపోయిందని అన్నారు. తాను కాపు కులంలో పుట్టి.. రాజకీయంగా ఎదిగానని ధైర్యంగా చెప్పుకుంటానన్నారు.
Gun Culture: గన్కల్చర్పై కన్నెర్ర.. ఒకే రోజు 813 తుపాకీ లైసెన్సులు రద్దు
రాష్ట్ర రాజకీయాల్లో నేను కూడా ఉన్నానని చెప్పుకునే ప్రయత్నంలోనే.. తనలాంటి వాళ్ల పేర్లను పవన్ ఉటంకిస్తుంటారని మంత్రి బొత్స కౌంటర్ వేశారు. నాయకత్వం వహిస్తున్న వాళ్ళు, రాజకీయ లక్ష్యం ఉన్న వాళ్ళు.. రాజకీయ అవగాహన, అసెంబ్లీ జరిగే విధానం తెలుసుకోవాలని సూచించారు. టీడీపీతో భాగస్వామిగా ఉన్న సమయంలో.. బీసీలకు జరిగిన అన్యాయం పవన్ కళ్యాణ్కు గుర్తు రాలేదా? అని నిలదీశారు. మహాయజ్ఞం జరుగుతుంటే.. భగ్నం చేసే రాక్షసులుగా టీడీపీ నాయకులు మారారని విమర్శించారు. ఆ రాక్షసుల్ని దాటుకొని తాము ముందుకు వస్తామన్నారు. ఇక రేపటి నుంచే సీఎం జగన్ విశాఖకు రావాలని తన కోరిక అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
తాజావార్తలు
-
Ram Gopal Varma : పెద్ద స్లార్లకు, భారీ బడ్జెట్ డైరెక్టర్లకు RGV కౌంటర్… హాలీవుడ్ హారర్ పై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Ram Charan : ‘పెద్ది’ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్… వీడియో వైరల్
-
Today Gold and Silver Prices: బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవిగో.. తగ్గాయా? పెరిగాయా?
-
Rebal Star Fans : రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో మాములుగా ఉండదు
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!