Botsa Satyanarayana: మంత్రి బొత్స సవాల్.. పవన్ కళ్యాణ్కి ఆ ప్రకటన చేసే దమ్ముందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana Challenges Pawan Kalyan: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్కి ఓ సవాల్ విసిరారు. రాజ్యాధికారం కోసం రెండు పార్టీలతో సంబంధాలు ఉన్నప్పటికీ.. నాయకత్వం మాదేనని ప్రకటించే దమ్ము పవన్ కళ్యాణ్కి ఉందా? అని ఛాలెంజ్ చేశారు. విశాఖపట్నంలో మంత్రి బొత్స మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే తాపత్రయంతోనే ఆయనపై బురదజల్లే ఆలోచనలో పవన్ ఉన్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ది కేవలం ఒక సెలబ్రిటీ పార్టీ అని, మూడ్ వచ్చినప్పుడు మాత్రమే పవన్ మాట్లాడుతుంటారని, ఆయన వైఖరి చూస్తుంటే జాలేస్తుందని చెప్పారు. నిర్దిష్టమైన లక్ష్యం ఉంటే.. నీతి, నిజాయితీతో పోరాడాలని సూచించారు. ఆ విధంగా చేస్తే.. ఏ 30 ఏళ్లకో అవకాశం వస్తుందని, అప్పటివరకు ఎన్ని చేసిన వేస్ట్ అని తేల్చి చెప్పారు.
Kapil Sharma: అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. కపిల్ శర్మ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
రాజకీయాల్లోకి వచ్చాక తాను టాటా బిర్లాల మాదిరిగి ఎదిగిపోయానని పవన్ వ్యాఖ్యానిస్తున్నారని.. వాళ్ల మాదిరి తానెక్కడ ఎదిగిపోయానో పవన్ చెప్పగలరా? అని బొత్స ప్రశ్నించారు. బలహీన వర్గాలకు వైసీపీ ఒక బ్రాండ్ అంబాసిడర్ లాంటి పార్టీ అని వెల్లడించారు. మా ప్రభుత్వానికి, పార్టీకి బీసీలు బ్యాక్ బోన్ అని ముఖ్యమంత్రి బహిరంగంగానే చెప్పారని గుర్తు చేశారు. పక్క రాష్ట్రంలో బీసీలకు జరుతున్న అన్యాయంపై పవన్ ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. తనకంటే ముందే కాపు కులం నుంచి చాలామంది మంత్రులు వచ్చారని చెప్పిన ఆయన.. తాను వ్యక్తిగతంగా ఎంత అభివృద్ధి చెందానో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ అన్యాయం జరిగిందో చెప్పాలని అడిగారు. గంటకో కులం అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని.. కులం, మతం అనేది సమాజంలో ఒక భాగమైపోయిందని అన్నారు. తాను కాపు కులంలో పుట్టి.. రాజకీయంగా ఎదిగానని ధైర్యంగా చెప్పుకుంటానన్నారు.
Gun Culture: గన్కల్చర్పై కన్నెర్ర.. ఒకే రోజు 813 తుపాకీ లైసెన్సులు రద్దు
రాష్ట్ర రాజకీయాల్లో నేను కూడా ఉన్నానని చెప్పుకునే ప్రయత్నంలోనే.. తనలాంటి వాళ్ల పేర్లను పవన్ ఉటంకిస్తుంటారని మంత్రి బొత్స కౌంటర్ వేశారు. నాయకత్వం వహిస్తున్న వాళ్ళు, రాజకీయ లక్ష్యం ఉన్న వాళ్ళు.. రాజకీయ అవగాహన, అసెంబ్లీ జరిగే విధానం తెలుసుకోవాలని సూచించారు. టీడీపీతో భాగస్వామిగా ఉన్న సమయంలో.. బీసీలకు జరిగిన అన్యాయం పవన్ కళ్యాణ్కు గుర్తు రాలేదా? అని నిలదీశారు. మహాయజ్ఞం జరుగుతుంటే.. భగ్నం చేసే రాక్షసులుగా టీడీపీ నాయకులు మారారని విమర్శించారు. ఆ రాక్షసుల్ని దాటుకొని తాము ముందుకు వస్తామన్నారు. ఇక రేపటి నుంచే సీఎం జగన్ విశాఖకు రావాలని తన కోరిక అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?