Bonda Uma: రోజా సొల్లు మాటలు మానుకోవాలి.. ఆమె అలాంటి సినిమాల్లో నటించలేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబానికి టీడీపీ ఆర్ధిక సహాయం అందించింది. ఈ మేరకు టీడీపీ నేతలు బోండా ఉమ, వంగలపూడి అనిత బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా వ్యాఖ్యలకు బోండా ఉమ కౌంటర్ ఇచ్చారు. రోజా సొల్లు మాటలు చెప్పడం మానుకోవాలని.. జగన్ ప్రభుత్వ హయాంలో 800 మంది మహిళలపై దాడులు జరిగితే ఏం చేశారని ప్రశ్నించారు. బ్లూఫిల్మ్లలో పాల్గొన్నట్టు స్వయంగా రోజా మీదే అభియోగాలు ఉన్నాయని బోండా ఉమ వ్యాఖ్యానించారు. స్టేజ్ షోల్లో మాట్లాడినట్టు రోజా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదని హెచ్చరించారు. వనజాక్షి, కాల్ మనీ సెక్స్ రాకెట్ అంటూ టీడీపీపై విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాలని.. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయింది.. ఇన్నాళ్లూ ఏం చేశారని నిలదీశారు. వనజాక్షి ఎపిసోడ్పై మళ్లీ విచారణ జరిపించాలని.. కాల్ మనీ సెక్స్ రాకెట్టును బయట పెట్టి కేసులు పెట్టిందే టీడీపీ ప్రభుత్వమన్నారు.
విజయవాడ గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబానికి టీడీపీ అండగా ఉందని.. అందుకే తమకు నోటీసులు ఇచ్చారని బోండా ఉమా ఆరోపించారు. తనకు పవర్స్ ఉన్న చందంగా వాసిరెడ్డి పద్మ ఏదేవో మాట్లాడుతున్నారని.. మహిళా కమిషన్కు ఉన్న అధికారాలు వాసిరెడ్డి పద్మ చదివారా అని నిలదీశారు. అనర్హత కలిగిన వ్యక్తి మహిళ కమిషన్ ఛైర్పర్సన్గా ఉన్నారని బోండా ఉమ అన్నారు. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని.. ఆమెను ఆ పదవి నుంచి తప్పించాలని సీఎస్, జాతీయ మహిళా కమిషన్ను కోరుతున్నామని బోండా ఉమ చెప్పారు. వాసిరెడ్డి పద్మ మేకప్ వేసుకుని తీర్పులు చెప్పొచ్చని అనుకుంటున్నారేమో.. అది కుదరదన్నారు. మహిళా కమిషన్ ఇచ్చిన సమన్లతో తమ వెంట్రుక కూడా ఊడదన్నారు. చట్టం వాసిరెడ్డి పద్మకే కాదు.. మాకూ చట్టం ఉందన్నారు. మహిళా కమిషన్ చర్యలను ఏ విధంగా ఎదుర్కొవాలో తమకు తెలుసన్నారు.
Also Read
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
- Off The Record : మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఎందుకు యాక్టివ్ అవ్వలేదు ?
- Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
ఆడబిడ్డ జీవితం విషయంలో వాసిరెడ్డి పద్మ రాజకీయం చేయడం సరికాదని టీడీపీ నేత వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. రాజకీయం చేయడానికి చాలా వేదికలున్నాయని.. రాజకీయ కోణంలోనే ఆలోచించే టీడీపీ నేతలకు వాసిరెడ్డి పద్మ నోటీసులిచ్చారని ఆమె ఆరోపించారు. తాము బాధితురాలితో కలిసి మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్తున్నామని.. వాసిరెడ్డి పద్మకు చిత్తశుద్ధి ఉంటే తమతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. కాగా ప్రభుత్వం రూ.10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుందని బాధితురాలి తల్లి ఆరోపించారు.
తాజావార్తలు
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్టైమ్ రికార్డ్!
-
IPL 2026 Playoffs Race: ముంబైపై కేకేఆర్ విజయం.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ గల్లంతే, దేవుడు దిగొస్తే తప్ప!
-
Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ పై ఇజ్రాయెల్ అనుమానాలు!
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!