Bonda Uma: రోజా సొల్లు మాటలు మానుకోవాలి.. ఆమె అలాంటి సినిమాల్లో నటించలేదా?
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబానికి టీడీపీ ఆర్ధిక సహాయం అందించింది. ఈ మేరకు టీడీపీ నేతలు బోండా ఉమ, వంగలపూడి అనిత బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా వ్యాఖ్యలకు బోండా ఉమ కౌంటర్ ఇచ్చారు. రోజా సొల్లు మాటలు చెప్పడం మానుకోవాలని.. జగన్ ప్రభుత్వ హయాంలో 800 మంది మహిళలపై దాడులు జరిగితే ఏం చేశారని ప్రశ్నించారు. బ్లూఫిల్మ్లలో పాల్గొన్నట్టు స్వయంగా రోజా మీదే అభియోగాలు ఉన్నాయని బోండా ఉమ వ్యాఖ్యానించారు. స్టేజ్ షోల్లో మాట్లాడినట్టు రోజా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదని హెచ్చరించారు. వనజాక్షి, కాల్ మనీ సెక్స్ రాకెట్ అంటూ టీడీపీపై విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాలని.. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయింది.. ఇన్నాళ్లూ ఏం చేశారని నిలదీశారు. వనజాక్షి ఎపిసోడ్పై మళ్లీ విచారణ జరిపించాలని.. కాల్ మనీ సెక్స్ రాకెట్టును బయట పెట్టి కేసులు పెట్టిందే టీడీపీ ప్రభుత్వమన్నారు.
విజయవాడ గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబానికి టీడీపీ అండగా ఉందని.. అందుకే తమకు నోటీసులు ఇచ్చారని బోండా ఉమా ఆరోపించారు. తనకు పవర్స్ ఉన్న చందంగా వాసిరెడ్డి పద్మ ఏదేవో మాట్లాడుతున్నారని.. మహిళా కమిషన్కు ఉన్న అధికారాలు వాసిరెడ్డి పద్మ చదివారా అని నిలదీశారు. అనర్హత కలిగిన వ్యక్తి మహిళ కమిషన్ ఛైర్పర్సన్గా ఉన్నారని బోండా ఉమ అన్నారు. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని.. ఆమెను ఆ పదవి నుంచి తప్పించాలని సీఎస్, జాతీయ మహిళా కమిషన్ను కోరుతున్నామని బోండా ఉమ చెప్పారు. వాసిరెడ్డి పద్మ మేకప్ వేసుకుని తీర్పులు చెప్పొచ్చని అనుకుంటున్నారేమో.. అది కుదరదన్నారు. మహిళా కమిషన్ ఇచ్చిన సమన్లతో తమ వెంట్రుక కూడా ఊడదన్నారు. చట్టం వాసిరెడ్డి పద్మకే కాదు.. మాకూ చట్టం ఉందన్నారు. మహిళా కమిషన్ చర్యలను ఏ విధంగా ఎదుర్కొవాలో తమకు తెలుసన్నారు.
Also Read
- CM Chandrababu Naidu: పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!
- Hundi Income: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు.. కళ్లు చెదిరే ఆదాయం..
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
ఆడబిడ్డ జీవితం విషయంలో వాసిరెడ్డి పద్మ రాజకీయం చేయడం సరికాదని టీడీపీ నేత వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. రాజకీయం చేయడానికి చాలా వేదికలున్నాయని.. రాజకీయ కోణంలోనే ఆలోచించే టీడీపీ నేతలకు వాసిరెడ్డి పద్మ నోటీసులిచ్చారని ఆమె ఆరోపించారు. తాము బాధితురాలితో కలిసి మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్తున్నామని.. వాసిరెడ్డి పద్మకు చిత్తశుద్ధి ఉంటే తమతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. కాగా ప్రభుత్వం రూ.10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుందని బాధితురాలి తల్లి ఆరోపించారు.
తాజావార్తలు
-
AK47: ‘ఆదర్శకుటుంబం’ షూటింగ్ అప్ డేట్..
-
SRH vs KKR: సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా హెడ్ టు హెడ్ రికార్డ్స్.. ఇప్పటివరకు కేకేఆర్దే పైచేయి
-
Vijay TVK Plan B: రేపు ఫలితాలు.. విజయ్ ‘ప్లాన్-బి’ రెడీ.. అభ్యర్థులకు దళపతి సీరియస్ వార్నింగ్!
-
NBK112 : CM రేసులో నందమూరి బాలకృష్ణ
-
Census 2026 Scam Alert: జాగ్రత్త! జనాభా లెక్కల పేరుతో మోసం.. ఈ వివరాలను పంచుకోవద్దు.. ఏం చేయాలో తెలుసుకోండి
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!