Andhra Pradesh: ఏపీలో భారీగా పెరిగిన రక్తపోటు, షుగర్ బాధితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా ప్రజల జీవన విధానం మారుతోంది. ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. దీంతో ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారు. ఏపీలో అయితే భారీగా రక్తపోటు, మధుమేహం బాధితులు పెరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధ్యయనం స్పష్టం చేసింది. ప్రతి 100 మందిలో ఎవరో ఒకరు ఈ రెండింటిలో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత రాష్ట్రాల వారీగా ప్రజల ఆరోగ్య వివరాలను తెలపాలని కేంద్రం ఆదేశించింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు 30 ఏళ్లకు పైబడిన వారిలో రక్తపోటు, మధుమేహం గుర్తించేందుకు గ్లూకోమీటర్, బీపీ పరికరాలను సమకూర్చారు. ఈ మేరకు ఏపీలో 2020 సెప్టెంబర్ 1 నుంచి 2021 మార్చి 31 వరకు సర్వే నిర్వహించారు. సర్వేలో భాగంగా 2,30,69,207 మంది 30 ఏళ్లు పైబడిన వారిని పరీక్షించారు. వీరిలో 19.11 లక్షల మంది రక్తపోటుతో.. 14.28 లక్షల మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఏపీలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1.52 లక్షల మంది రక్తపోటుతో, 1.44 లక్షల మంది షుగర్తో బాధపడుతున్నట్లు సర్వే ద్వారా స్పష్టమైంది. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 53,043 మంది రక్తపోటు, 51,353 మంది షుగర్ బాధితులు ఉన్నారు. అయితే నిర్ధారణ పరీక్షలతో వీరిని మరోసారి పరీక్షించాలని కేంద్రం ఆదేశించడంతో అధికారులు తాజాగా మళ్లీ సర్వే చేపట్టారు.
Also Read
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
https://ntvtelugu.com/mla-jaggireddy-tulabharam-in-east-godavari-district/
తాజావార్తలు
-
AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్గా తమిళ సిరీస్!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
ట్రెండింగ్
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!