Andhra Pradesh: ఏపీలో భారీగా పెరిగిన రక్తపోటు, షుగర్ బాధితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా ప్రజల జీవన విధానం మారుతోంది. ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. దీంతో ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారు. ఏపీలో అయితే భారీగా రక్తపోటు, మధుమేహం బాధితులు పెరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధ్యయనం స్పష్టం చేసింది. ప్రతి 100 మందిలో ఎవరో ఒకరు ఈ రెండింటిలో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత రాష్ట్రాల వారీగా ప్రజల ఆరోగ్య వివరాలను తెలపాలని కేంద్రం ఆదేశించింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు 30 ఏళ్లకు పైబడిన వారిలో రక్తపోటు, మధుమేహం గుర్తించేందుకు గ్లూకోమీటర్, బీపీ పరికరాలను సమకూర్చారు. ఈ మేరకు ఏపీలో 2020 సెప్టెంబర్ 1 నుంచి 2021 మార్చి 31 వరకు సర్వే నిర్వహించారు. సర్వేలో భాగంగా 2,30,69,207 మంది 30 ఏళ్లు పైబడిన వారిని పరీక్షించారు. వీరిలో 19.11 లక్షల మంది రక్తపోటుతో.. 14.28 లక్షల మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఏపీలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1.52 లక్షల మంది రక్తపోటుతో, 1.44 లక్షల మంది షుగర్తో బాధపడుతున్నట్లు సర్వే ద్వారా స్పష్టమైంది. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 53,043 మంది రక్తపోటు, 51,353 మంది షుగర్ బాధితులు ఉన్నారు. అయితే నిర్ధారణ పరీక్షలతో వీరిని మరోసారి పరీక్షించాలని కేంద్రం ఆదేశించడంతో అధికారులు తాజాగా మళ్లీ సర్వే చేపట్టారు.
Also Read
https://ntvtelugu.com/mla-jaggireddy-tulabharam-in-east-godavari-district/
తాజావార్తలు
-
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
-
Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
-
Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి
-
Madatha Kaja Recipe : స్వీట్ షాప్ స్టైల్లో జ్యూసీ మడత కాజాలు ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండిలా.!
-
Tamilnadu: చీలిక దిశగా ఏఐఏడీఎంకే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా తప్పదా! కారణమిదేనా?
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?