BJP Vishnuvardhan Reddy : ఏపీలో బీజేపీపై జగన్ చేస్తున్న కుట్ర ఇది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో రేపు, ఎల్లుండి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. నడ్డా పర్యటన ఏపీలో కచ్చితమైన మార్పుకు సంకేతమని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బీజేపీ రోడ్ మ్యాప్ను ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతారని, 2024 ఎన్నికలకు దశాదిశా నిర్దేశం ఇస్తారని ఆయన వెల్లడించారు. ఎన్నికలకు సన్నద్దం అయ్యేలా క్యాడర్ను సిద్ధం చేస్తారని, నడ్డా ఏపీ కార్యక్రమం ఖరారు కాగానే జగన్ డిల్లీ పర్యటన పెట్టుకున్నారన్నారు. ఇటువంటి డ్రామాలు జగన్ గతంలో కూడా ఆడారని, డైవర్ట్ పాలిటిక్స్ తో జగన్ మాయ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
పొలిటికల్ మైండ్ గేమ్ ను వైసీపీ ప్రారంభించిందని, బీజేపీ పెద్దలతో వారు అన్నీ మాట్లాడినట్లు చెప్పుకుంటారని, కానీ ఆ వివరాలు ఏవీ కూడా మీడియాకు చెప్పరంటూ ఆయన ధ్వజమెత్తారు. ఏపీలో బీజేపీపై జగన్ చేస్తున్న కుట్ర ఇదని, గతంలో టీడీపీ కూడా ఇలానే మాయ చేసిందని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలకు మాకు మద్దతు ఇచ్చే పార్టీలు చాలా ఉన్నాయన్నారు. అయినా వైసీపీ ఉద్దేశపూర్వకంగా రాష్ట్రపతి అంశాన్ని తెర మీదకి తెస్తుందని, ప్రజలు ఒక్క ఛాన్స్ అంటే జగన్ కి ఇచ్చారని, ఇప్పుడు జనసేన, బీజేపీకి ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరుతున్నామన్నారు.
Also Read
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
- AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
పవన్ కళ్యాణ్ కూడా నిన్న స్పష్టంగా చెప్పేశారని, ఇంతకాలం తగ్గాం… ఇక తగ్గేదెలే అని తేల్చారన్నారు. ఎవరి కోసమో మేము పని చేయనక్కర్లేదని, త్యాగాలు చేయడానికి వారే సిద్దంగా ఉండాలన్నారు. గతంలో కూడా త్యాగాలకు సిద్దమని ప్రకటించారని, 2024లో బీజేపీ, జనసేన కలిసే అధికారంలోకి వస్తాయన్నారు.
తాజావార్తలు
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
-
Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్కు చెక్..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!