PVN Madhav: వైసీపీ, టీడీపీలకు రాష్ట్రం స్వంత జాగీరా?
ఏపీని తెలుగుదేశం, వైసీపీలు స్వంత జాగీర్లా చూస్తున్నాయని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్. వైసీపీ ప్లీనరీ, టీడీపీ మహానాడు కుటుంబ పాలనకు అద్దం పడుతుంది.నిస్సిగ్గుగా రెండు పార్టీలకు శాశ్వత అధ్యక్షులుగా ఎన్నుకున్నారు.రాష్ట్రాన్ని టీడీపీ, వైసీపీలు తమ సొంత జాగీరు అన్నట్టుగా మార్చేశాయి.వైసీపీ ప్లీనరీలో మొత్తం అసత్యాలు ప్రస్తావించారు.కేంద్రమిచ్చిన నిధులతో పథకాలకు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నారు.అర్భీకేల నిర్మాణం కేంద్రమిచ్చిన నిధులతో చేస్తున్నారా..? లేదా..?రాష్ట్రంలో పెట్టిన పెట్టుబడులు ఎన్ని.? వచ్చిన పరిశ్రమలు ఎక్కడ..?
పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం ముందుకు రావడం లేదు.వైజాగ్-చెన్నై, వైజాగ్-హైదరాబాద్, వైజాగ్-కాకినాడ కారిడార్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది.పోర్టుల నిర్మాణంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి.కొత్త పోర్టును ప్రభుత్వం ఎందుకు నిర్మాణం చేయలేకపోతుంది.వైజాగులో ఐఐపీయం రాష్ట్ర ప్రభుత్వం కారణంగా వెళ్ళిపోతుంది.మంగళగిరిలో ఎయిమ్స్ కు వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.అమరావతి నుంచి అనంతపురం వరకు భూసేకరణ చేస్తామని చెప్పి ఇప్పటికే వరకు సేకరించలేదు.
Also Read
- Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
- Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
- Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
- CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో మిత వాధ సంస్థలు రెచ్చిపోతున్నాయి.రాష్ట్రంలో పీఎఫ్ఐ ప్రతినిధులు అరాచకాలు చేస్తున్నారు.సిమి సంస్థ ద్వారా రూపాంతరం చెందిన మితవాద సంస్థలు పెరిగిపోతున్నాయి. సామాజిక అంశాల పేరుతో ప్రజల్లోకి వెళ్లి అశాంతిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.14వ తేదీన సివిల్ సప్లైస్ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపడతాం అన్నారు పీవీఎన్ మాధవ్.
Buddha Venkanna: వైసీపీ ప్లీనరీపై బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు
అమరావతిలో బీజేపీ ఏపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది. సమావేశంలో సోము వీర్రాజు, పురందేశ్వరీ, కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో వచ్చిన అంశాలపై చర్చించారు.
ఏపీలో కేంద్రం ద్వారానే అభివృద్ధి జరుగుతోందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. నవ రత్నాల అమలు రోజు రోజుకూ తీసికట్టుగా మారుతోంది.అధికార పార్టీ పెట్టుకున్న సమావేశంలో వ్యక్తిగత దూషణలకే పెద్ద పీట వేశారు.సభల్లో వారి నాయకుడిని పొగడడం మిగతా రాజకీయ పక్షాలను తిట్టడాన్ని బీజేపీ ఖండిస్తోంది.రాష్ట్రంలో కొత్త పోకడ కనిపిస్తోంది. కొంతమంది మాట్లాడే భాష దారుణంగా ఉందని ఆయన మండిపడ్డారు.
తాజావార్తలు
-
Dhanush : వెంకీ అట్లూరితో ధనుష్ సినిమా.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సార్
-
Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
-
Dhanush: ఆ మాటలు అక్కర్లేదేమో!
-
BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ
-
Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా కన్నుమూత! కుడ్యచిత్రం ఆవిష్కరణ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!