AP Govt vs BJP: ఇదేం పద్ధతి.. జగన్ కట్టిన ప్యాలెస్కి నిధులు.. టిడ్కో ఇళ్లు కట్టిన వాళ్లకి నో పేమెంట్స్
- అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాట్ కామెంట్స్..
- జగన్ కట్టిన ప్యాలెస్ కి నిధులిచ్చారు.. టిడ్కో ఇళ్లు కట్టిన వాళ్లకు డబ్బులు ఇవ్వలేదు..
- ఆర్థిక శాఖ తీరుపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు..
- మరో మూడేళ్లలో టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుంది: మంత్రి నారాయణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Govt vs BJP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాట్ కామెంట్స్ చేశారు. విశాఖపట్నంలోని ఋషికొండపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్యాలెస్ కట్టిన వాళ్లకి ఆర్థిక శాఖ నిధులు మంజూరు చేసింది.. కానీ, టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారికి మాత్రం ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదు అని మండిపడ్డారు. ఎందుకు ఇంత వివక్ష చూస్తున్నారు అంటూ ఆర్థిక శాఖ తీరుపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: Uttar Pradesh: రోడ్డు మీదనే మొగుడిని పొట్టు పొట్టు కొట్టిన భార్య
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
ఇక, అసెంబ్లీలో టిడ్కో ఇళ్లపై ఎమ్మెల్యేల ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానం ఇస్తూ.. రాష్ట్రంలోని 113 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది.. మౌలిక సదుపాయాల కల్పన ప్రారంభమైందన్నారు. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు రూ. 3,664 కోట్లు ఉన్నాయి. ప్రాజెక్ట్ పూర్తవ్వాలంటే సుమారు రూ. 6,000 కోట్లు అవసరం.. త్వరలోనే నిర్మాణాలు పూర్తి అయ్యేలా దృష్టి పెట్టనున్నాం అన్నారు. అయితే, 2014–19 మధ్యలో కేంద్ర ప్రభుత్వం 7,01,481 టిడ్కో ఇళ్లు ఏపీకి కేటాయించింది.. వీటిలో 5,14,000 ఇళ్ల నిర్మాణానికి పాలనా అనుమతులు తీసుకుని టెండర్లు పిలిచాం.. కానీ, గత ప్రభుత్వం వీటిని 2,61,640 ఇళ్లకు తగ్గించడమే కాకుండా, నిర్మాణాలను కూడా పూర్తి చేయలేదు అని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు.
Read Also: Malavika Mohanan : పెద్ద సినిమాలు కాదు.. అలాంటి పాత్రలే ముఖ్యం
అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో 51 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది అని నారాయణ తెలిపారు. ఇంకా 112 ప్రాంతాల్లో నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు, ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి మొత్తం రూ. 6,139 కోట్లు అవసరం.. రూ. 4,500 కోట్లు రుణంగా ఇవ్వడానికి హడ్కో అంగీకరించింది.. హడ్కో నిధులు విడుదల కాగానే బిల్లులు క్లియర్ చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!