AP Govt vs BJP: ఇదేం పద్ధతి.. జగన్ కట్టిన ప్యాలెస్కి నిధులు.. టిడ్కో ఇళ్లు కట్టిన వాళ్లకి నో పేమెంట్స్
- అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాట్ కామెంట్స్..
- జగన్ కట్టిన ప్యాలెస్ కి నిధులిచ్చారు.. టిడ్కో ఇళ్లు కట్టిన వాళ్లకు డబ్బులు ఇవ్వలేదు..
- ఆర్థిక శాఖ తీరుపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు..
- మరో మూడేళ్లలో టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుంది: మంత్రి నారాయణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Govt vs BJP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాట్ కామెంట్స్ చేశారు. విశాఖపట్నంలోని ఋషికొండపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్యాలెస్ కట్టిన వాళ్లకి ఆర్థిక శాఖ నిధులు మంజూరు చేసింది.. కానీ, టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారికి మాత్రం ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదు అని మండిపడ్డారు. ఎందుకు ఇంత వివక్ష చూస్తున్నారు అంటూ ఆర్థిక శాఖ తీరుపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: Uttar Pradesh: రోడ్డు మీదనే మొగుడిని పొట్టు పొట్టు కొట్టిన భార్య
Also Read
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
ఇక, అసెంబ్లీలో టిడ్కో ఇళ్లపై ఎమ్మెల్యేల ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానం ఇస్తూ.. రాష్ట్రంలోని 113 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది.. మౌలిక సదుపాయాల కల్పన ప్రారంభమైందన్నారు. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు రూ. 3,664 కోట్లు ఉన్నాయి. ప్రాజెక్ట్ పూర్తవ్వాలంటే సుమారు రూ. 6,000 కోట్లు అవసరం.. త్వరలోనే నిర్మాణాలు పూర్తి అయ్యేలా దృష్టి పెట్టనున్నాం అన్నారు. అయితే, 2014–19 మధ్యలో కేంద్ర ప్రభుత్వం 7,01,481 టిడ్కో ఇళ్లు ఏపీకి కేటాయించింది.. వీటిలో 5,14,000 ఇళ్ల నిర్మాణానికి పాలనా అనుమతులు తీసుకుని టెండర్లు పిలిచాం.. కానీ, గత ప్రభుత్వం వీటిని 2,61,640 ఇళ్లకు తగ్గించడమే కాకుండా, నిర్మాణాలను కూడా పూర్తి చేయలేదు అని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు.
Read Also: Malavika Mohanan : పెద్ద సినిమాలు కాదు.. అలాంటి పాత్రలే ముఖ్యం
అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో 51 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది అని నారాయణ తెలిపారు. ఇంకా 112 ప్రాంతాల్లో నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు, ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి మొత్తం రూ. 6,139 కోట్లు అవసరం.. రూ. 4,500 కోట్లు రుణంగా ఇవ్వడానికి హడ్కో అంగీకరించింది.. హడ్కో నిధులు విడుదల కాగానే బిల్లులు క్లియర్ చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.
తాజావార్తలు
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
-
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!