AP Govt vs BJP: ఇదేం పద్ధతి.. జగన్ కట్టిన ప్యాలెస్కి నిధులు.. టిడ్కో ఇళ్లు కట్టిన వాళ్లకి నో పేమెంట్స్
- అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాట్ కామెంట్స్..
- జగన్ కట్టిన ప్యాలెస్ కి నిధులిచ్చారు.. టిడ్కో ఇళ్లు కట్టిన వాళ్లకు డబ్బులు ఇవ్వలేదు..
- ఆర్థిక శాఖ తీరుపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు..
- మరో మూడేళ్లలో టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుంది: మంత్రి నారాయణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Govt vs BJP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాట్ కామెంట్స్ చేశారు. విశాఖపట్నంలోని ఋషికొండపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్యాలెస్ కట్టిన వాళ్లకి ఆర్థిక శాఖ నిధులు మంజూరు చేసింది.. కానీ, టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారికి మాత్రం ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదు అని మండిపడ్డారు. ఎందుకు ఇంత వివక్ష చూస్తున్నారు అంటూ ఆర్థిక శాఖ తీరుపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: Uttar Pradesh: రోడ్డు మీదనే మొగుడిని పొట్టు పొట్టు కొట్టిన భార్య
Also Read
ఇక, అసెంబ్లీలో టిడ్కో ఇళ్లపై ఎమ్మెల్యేల ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానం ఇస్తూ.. రాష్ట్రంలోని 113 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది.. మౌలిక సదుపాయాల కల్పన ప్రారంభమైందన్నారు. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు రూ. 3,664 కోట్లు ఉన్నాయి. ప్రాజెక్ట్ పూర్తవ్వాలంటే సుమారు రూ. 6,000 కోట్లు అవసరం.. త్వరలోనే నిర్మాణాలు పూర్తి అయ్యేలా దృష్టి పెట్టనున్నాం అన్నారు. అయితే, 2014–19 మధ్యలో కేంద్ర ప్రభుత్వం 7,01,481 టిడ్కో ఇళ్లు ఏపీకి కేటాయించింది.. వీటిలో 5,14,000 ఇళ్ల నిర్మాణానికి పాలనా అనుమతులు తీసుకుని టెండర్లు పిలిచాం.. కానీ, గత ప్రభుత్వం వీటిని 2,61,640 ఇళ్లకు తగ్గించడమే కాకుండా, నిర్మాణాలను కూడా పూర్తి చేయలేదు అని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు.
Read Also: Malavika Mohanan : పెద్ద సినిమాలు కాదు.. అలాంటి పాత్రలే ముఖ్యం
అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో 51 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది అని నారాయణ తెలిపారు. ఇంకా 112 ప్రాంతాల్లో నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు, ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి మొత్తం రూ. 6,139 కోట్లు అవసరం.. రూ. 4,500 కోట్లు రుణంగా ఇవ్వడానికి హడ్కో అంగీకరించింది.. హడ్కో నిధులు విడుదల కాగానే బిల్లులు క్లియర్ చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!