Vishnuvardhan Reddy: జనసేన-బీజేపీ పొత్తుపై విష్ణువర్ధన్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. మాధవ్ ఉద్దేశ్యం ఏంటో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishnuvardhan Reddy: జనసేన, బీజేపీ మధ్య పొత్తు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ రోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. ఇద్దరు బీజేపీ నేతల మాటలకు పొంతన లేకుండా పోయింది.. ఒకరు పవన్ కల్యాణ్ ని అడిగినా సహకరించలేదని ఆరోపిస్తే.. పవన్ మద్దతు ప్రకటించారంటూ మరో నేత వ్యాఖ్యానించడం హాట్ టాపిక్గా మారింది.. బీజేపీ నేత మాధవ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే విధంగా మాట్లాడారు బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేన-బీజేపీలనే ప్రజలు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని తెలిపారు విష్ణువర్ధన్రెడ్డి.. ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే.. జాతీయ నాయకత్వంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుకోవచ్చు అని సలహా ఇచ్చారు.. అయితే, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థికి పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించారని గుర్తుచేశారు.. కానీ, మాధవ్ ఏ ఉద్దేశ్యంతో ఆ కామెంట్లు చేశారో నాకు తెలియదని పేర్కొన్నారు.
Read Also: Janasena and BJP Alliance: జనసేన-బీజేపీ పొత్తు.. మాధవ్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
- AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
- YS Jagan: డీఎస్సీ నిరసనలపై దాడులు దారుణం.. Gen Z గొంతును మూయలేరు..
- CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
కాగా, జనసేన-బీజేపీ పొత్తుపై బీజేపీ నేత మాధవ్ కీలక కామెంట్లు చేశారు.. గతంతో పోల్చుకుంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు వచ్చిన ఓట్ల శాతం పెరిగిందన్నారు.. విశాఖలో ఓట్ల శాతం తగ్గింది.. కానీ, మిగిలిన చోట్ల ఓట్ల శాతం పెరిగిందన్నారు. ఇక, జనసేనతో కలిసి ఉన్నాం.. కానీ, కలిసున్నా లేనట్టేనని మేం భావిస్తున్నాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాధవ్.. జనసేనతో కలిసి బీజేపీ ప్రజల్లోకి వెళ్తేనే పొత్తు ఉందని నమ్ముతారన్న ఆయన.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన మాతో కలిసి రాలేదని ఆరోపించారు.. తమ అభ్యర్థికి జనసేన మద్దతు ఉందని పీడీఎఫ్ చెప్పుకుంటుంటే.. ఆ విషయాన్ని ఖండించమని జనసేనను కోరినా ఖండించ లేదని విమర్శించారు. మాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసి రావడం లేదనేది మా ఆరోపణ అన్నారు. మరోవైపు, మేం వైసీపీతో ఉన్నామనే ప్రచారాన్ని ప్రజలు నమ్మారు.. మేం బీజేపీ హైకమాండ్కు చెప్పే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని.. వైసీపీ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారని భావిస్తున్నాం అన్నారు మాధవ్.
తాజావార్తలు
-
Vishwanath and Sons Trailer: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
-
Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
-
Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
-
Ritika Nayak : ‘కొరియన్ కనకరాజు’తో జాక్పాట్.. టాలీవుడ్కు కొత్త గోల్డెన్ లెగ్గా రితికా నాయక్.!
-
Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!