బిల్లు ఉపసంహరణ వెనుక పెద్ద రాజకీయ కుట్ర: కనకమేడల రవీంద్రకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిల్లు ఉపసంహరణ వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టులను తప్పుదారి పట్టిం చాలన్న రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే నేడు బిల్లులు వెనక్కు తీసుకు నేలా చేసిందన్నారు. న్యాయస్థానాల్లో న్యాయం గెలుస్తుందన్న భయంతోనే ఇప్పుడు మూడు రాజధానుల బిల్లు ఉంపసంహరణ పూనుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న దాదాపు 180కు పైగా నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పుపట్టాయన్నారు. బిల్లులు విత్ డ్రా చేయడాన్ని స్వాగతిస్తున్నాం..కానీ ఆ నిర్ణయం వెనకున్న మీ దుర్భుద్ధిని ఖండిస్తున్నామని కనక మేడల అన్నారు.
లెజిస్లేచర్ ను పక్కదారి పట్టించి, ప్రజలను మోసంచేయడమేగాక న్యాయస్థానాలను తప్పుదారి పట్టిస్తున్నారని కనకమేడల ఆరోపిం చారు. గతంలో ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ఇష్టం లేక అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటున్నామన్నారు.ఆ ప్రకటనపై ఇప్పటి ప్రభుత్వం ఎందుకు వెనక్కు తగ్గిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ఇప్పుడు బిల్లులు ఉపసంహరించుకోవడం వెనుక పాలకులు రాజకీయ దురుద్దేశం కనిపిస్తోందని మండిపడ్డారు. 20-01-2020న ఆంధ్రప్రదేశ్ గెజిట్ లో డీసెంట్రలైజేషన్ యాక్ట్, సీఆర్డీఏ రిపీల్ బిల్ తీసుకొచ్చారు. ఆయాక్ట్ లో మొదటిది శ్రీకృష్ణ కమిటీని ఉల్లంఘించి, దానిపై ఎక్స్ పర్ట్ కమిటీ, బోస్టన్ కమిటీ, హైపవర్ కమిటీ వేశారని చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పిందే ఆయా కమిటీలు నివేదికల రూపంలో ప్రభుత్వం ముందు ఉంచాయి.
Also Read
- Botsa Satyanarayana: గవర్నర్కు బొత్స లేఖ.. విశాఖలో వద్దు.. విజయనగరం మార్చండి..!
- AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ.. పవన్ కల్యాణ్ సహా ఐదుగురు మంత్రుల డుమ్మా..!
- Pawan Kalyan: ప్రజలతో మరింతగా మమేకం కావాలి.. పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
- AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. అమరావతి అభివృద్ధిపై ఫోకస్.. వారికి గుడ్న్యూస్..!
తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బిల్లుల్లో కూడా పాలకులు అదే పంథాను అనుసరించబోతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి కాదు కదా..ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరి ప్రభుత్వం వచ్చినా రాజధాని మార్చలేదు.. మొదట్నుంచీ అదేచెబుతున్నాం. పార్లమెంట్లో జరిగిన చర్చలకు భిన్నంగా, రాజ్యాంగంలోని నిర్ణయాలకు విరుద్ధంగా, ఆర్గనైజేషన్ యాక్ట్కు భిన్నంగా వ్యవహరించడం ఎవరి వల్ల కాదన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని ఇప్పటికైనా చెప్పి, తప్పు ఒప్పుకుంటే ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారన్నారు.
తప్పు గ్రహించకుండా కోర్టులను ప్రజలను మోసగించాలని చూడకండి అని జగన్ ఉద్దేశించి అన్నారు. ఈ ప్రభుత్వం చేసిన తప్పులకు ఇంకో ముఖ్యమంత్రి అయితే ఎన్నోసార్లు రాజీనామా చేసేవాడు.కానీ వీరికి ఎలాంటి నైతిక విలువలు లేనందున అలా చేయరని ఎద్దేవా చేశారు. రాజధాని లేని అథోగతికి రాష్ట్రాన్ని దిగజార్చారు. అదే గందర గోళాన్ని మరో రెండున్నరేళ్లు కొనసాగించడానికి సిద్ధమయ్యారని కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Botsa Satyanarayana: గవర్నర్కు బొత్స లేఖ.. విశాఖలో వద్దు.. విజయనగరం మార్చండి..!
-
IND vs ENG: అతడు ఎందుకు దండగ.. ఎప్పుడో జట్టు నుంచి తప్పించాల్సింది!
-
2026 Tata Harrier: టాటా హారియర్, సఫారీ స్టెల్త్ ఎడిషన్ విడుదల.. 13 JBL స్పీకర్లు, లెవెల్-2 ADASతో అదిరిపోయే ఫీచర్లు
-
Lenin : అఖిల్కు మాజీ వదిన కంగ్రాట్స్.. సోషల్ మీడియాలో సామ్ పోస్ట్ వైరల్
-
AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ.. పవన్ కల్యాణ్ సహా ఐదుగురు మంత్రుల డుమ్మా..!
ట్రెండింగ్
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!