Bharti P Pawar: ఎయిమ్స్ అధికారులకు తలంటిన కేంద్రమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎయిమ్స్ ఉన్నతాధికారులకు తలంటేశారు కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్. మంగళగిరి ఎయిమ్స్ ని ఆమె సందర్శించారు. ఓపీ మొదలుకుని ఆస్పత్రిలో అందుతోన్న ప్రతి ఒక్క సేవ పైనా ఎయిమ్స్ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు పవార్. దీంతో నీళ్లు నమిలారు ఎయిమ్స్ అధికారులు. ఆస్పత్రికి నీటి సమస్య ఉందని.. టెండర్లు రావడం లేదన్నారు అధికారులు.
ఇంత పెద్ద భవనాలు కట్టడానికి టెండర్లు వచ్చినప్పుడు.. నీటి సరఫరా కోసం టెండర్లు ఎందుకు రావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి నీటి సమస్యను తీసుకెళ్లారా అంటూ ప్రశ్నించారు పవార్. సీఎం ఈ సమస్యను పరిష్కరిస్తామని హామి ఇచ్చారని అధికారులు కేంద్రమంత్రికి వివరించారు. వెంట పడి పని చేయించుకోవాలి కదా అంటూ కేంద్ర మంత్రి చురకలు అంటించారు. AIIMS లో ఖాళీలను భర్తీ చేయాల్సిన అంశాన్ని ప్రస్తావించారు అధికారులు.
Also Read
- YS Jagan Mohan Reddy: స్టీల్ ప్లాంట్ పనులు మొదలు.. X వేదికగా జగన్ కీలక వ్యాఖ్యలు.!
- Sajjala Ramakrishna Reddy: రాజధాని పేరుతో ప్రజలపై అప్పుల మోత.. సజ్జల సంచలన వ్యాఖ్యలు.!
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
- AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
దీనిపై ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి ఎందుకు తీసుకురాలేదని మండిపడ్డారు. ఓపీ సరిగా చూడడం లేదన్న ఫిర్యాదులపై అధికారులను వివరణ అడిగారు కేంద్ర మంత్రి. మీరు చేయలేకపోతున్నారని.. ప్రతి రోజూ నన్నే ఓ గంట పాటు ఓపీ చూడమంటారా..? అంటూ కేంద్ర మంత్రి పవార్ సీరియస్ అయ్యారు. ల్యాబ్ రిపోర్టులు ఎంత సేపట్లో అందిస్తున్నారని ప్రశ్నించారు కేంద్ర మంత్రి.
గంటలో అందిస్తున్నట్టు వెల్లడించిన అధికారులు. తనకొచ్చిన సమాచారం ప్రకారం ఓ రోజు పడుతోందని.. రిపోర్టులు వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. వేల కోట్ల రూపాయలతో నిధులందించినా ఆస్పత్రి నిర్వహణ ఇలా చేస్తారా..? అంటూ అధికారులపై మండిపడ్డారు కేంద్రమంత్రి భారతీ పవార్. ప్రధాని మోడీ ఒక్కరే పని చేస్తే సరిపోదని.. అందరూ పని చేయాలన్నారు కేంద్ర మంత్రి పవార్.
తాజావార్తలు
-
US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
-
PM Modi: న్యూజిలాండ్ టూర్కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Falcon Scam : 14 కోట్ల విమానం 3 కోట్లకే.. దేశంలోనే తొలిసారిగా విమానాన్ని ఈ-వేలం.!
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
ట్రెండింగ్
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!