Bharti P Pawar: ఎయిమ్స్ అధికారులకు తలంటిన కేంద్రమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎయిమ్స్ ఉన్నతాధికారులకు తలంటేశారు కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్. మంగళగిరి ఎయిమ్స్ ని ఆమె సందర్శించారు. ఓపీ మొదలుకుని ఆస్పత్రిలో అందుతోన్న ప్రతి ఒక్క సేవ పైనా ఎయిమ్స్ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు పవార్. దీంతో నీళ్లు నమిలారు ఎయిమ్స్ అధికారులు. ఆస్పత్రికి నీటి సమస్య ఉందని.. టెండర్లు రావడం లేదన్నారు అధికారులు.
ఇంత పెద్ద భవనాలు కట్టడానికి టెండర్లు వచ్చినప్పుడు.. నీటి సరఫరా కోసం టెండర్లు ఎందుకు రావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి నీటి సమస్యను తీసుకెళ్లారా అంటూ ప్రశ్నించారు పవార్. సీఎం ఈ సమస్యను పరిష్కరిస్తామని హామి ఇచ్చారని అధికారులు కేంద్రమంత్రికి వివరించారు. వెంట పడి పని చేయించుకోవాలి కదా అంటూ కేంద్ర మంత్రి చురకలు అంటించారు. AIIMS లో ఖాళీలను భర్తీ చేయాల్సిన అంశాన్ని ప్రస్తావించారు అధికారులు.
Also Read
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
దీనిపై ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి ఎందుకు తీసుకురాలేదని మండిపడ్డారు. ఓపీ సరిగా చూడడం లేదన్న ఫిర్యాదులపై అధికారులను వివరణ అడిగారు కేంద్ర మంత్రి. మీరు చేయలేకపోతున్నారని.. ప్రతి రోజూ నన్నే ఓ గంట పాటు ఓపీ చూడమంటారా..? అంటూ కేంద్ర మంత్రి పవార్ సీరియస్ అయ్యారు. ల్యాబ్ రిపోర్టులు ఎంత సేపట్లో అందిస్తున్నారని ప్రశ్నించారు కేంద్ర మంత్రి.
గంటలో అందిస్తున్నట్టు వెల్లడించిన అధికారులు. తనకొచ్చిన సమాచారం ప్రకారం ఓ రోజు పడుతోందని.. రిపోర్టులు వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. వేల కోట్ల రూపాయలతో నిధులందించినా ఆస్పత్రి నిర్వహణ ఇలా చేస్తారా..? అంటూ అధికారులపై మండిపడ్డారు కేంద్రమంత్రి భారతీ పవార్. ప్రధాని మోడీ ఒక్కరే పని చేస్తే సరిపోదని.. అందరూ పని చేయాలన్నారు కేంద్ర మంత్రి పవార్.
తాజావార్తలు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!