బద్వేల్లో రూటు మార్చిన బెట్టింగ్ రాయుళ్ళు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బద్వేల్ పోలింగ్కి రంగం సిద్ధమయింది. గెలుపు వైసీదే అని నిర్దారణ అయినా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మేం కూడా వున్నామని పోటీలో ముందుకెళుతున్నాయి. ఓట్లు ఎన్ని పడతాయో తెలీదు కానీ ఒట్టికుండకు హడావిడి ఎక్కువ అన్న చందంగా వేలల్లో ఓట్లు సాధిస్తామంటున్నాయి రెండు జాతీయ పార్టీలు. అయితే బద్వేల్ ఎన్నికలలో బెట్టింగ్ రాయుళ్ళు రూట్ మార్చారు.
బద్వేల్లో వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందనే వార్తలతో ఉప ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదు బెట్టింగ్ బంగర్రాజులు. వైసీపీ అభ్యర్థి గెలుపు కంటే బీజేపీకి ఎన్ని ఓట్లు పోలవుతాయి, బీజేపీ,కాంగ్రెస్ లకు డిపాజిట్ వస్తుందా రాదా అని పందేలు కాస్తున్నారు. బీజేపీకి 25 వేల ఓట్లు దాటతాయని పందెం కాస్తున్నారు పందెం రాయుళ్ళు. కేవలం రాజకీయ వర్గాలకు మాత్రమే పరిమితం అయింది ఈ బెట్టింగ్.
Also Read
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
గతంలో చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా డిపాజిట్లు గల్లంతయిన ఈ పార్టీలకు ఇప్పుడు వేలల్లో ఓట్లు వస్తాయని బెట్టింగ్ రాయుళ్ళు పందేలు కాయడం ఆసక్తికరంగా మారింది. మంచి పనులు చేశామని వైసీపీ నేతలు ఓట్లు అడగటం లేదని, బెదిరింపులు అరాచకాలతో గెలవాలని చూస్తున్నారని బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఇక్కడ గెలుపు అధికార వైసీపీదే అన్న విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. అయితే ఈ రెండు పార్టీల లో ఇక్కడ రెండవస్థానం ఎవరిది, గౌరవప్రదంగా ఓట్లఉ ఎవరు సాధిస్తారన్న దానిపైనే ఇప్పుడు ఇక్కడ బెట్టింగులు జరుగుతున్నాయి.
ఈ రెండు పార్టీల లో ఎవరికి అయినా డిపాజిట్ దక్కుతుందా ? బీజేపీ కంటే కాంగ్రెస్ కే ఎక్కువ ఓట్లు వస్తాయా ? ఎవరి బలం ఎంత? ఏ రాజకీయ పార్టీ రెపరెపలాడుతుంది? అనే కోణంలో ఇక్కడ బెట్టింగ్ లు నడుస్తున్నాయని తెలుస్తోంది. టీడీపీ అభిమానులు వైసీపీ, బీజేపీల కంటే కాంగ్రెస్ కు ఓట్లేస్తారని భావిస్తున్నారు.
బీజేపీకి ఓటు వేయకుండా ఏపీలో కమలం వాడిపోయిందని, ఇక్కడ అంత సీన్ లేదని చెప్పేందుకు కసితో ఉన్నారని తెలుస్తోంది. జనసేన ఓట్ల తమకు పడతాయని బీజేపీ గంపెడు ఆశతో ఉంది. మరి టీడీపీ ,జనసేన ఓట్లు నిజంగానే బీజేపీ, కాంగ్రెస్ కు పడతాయా? వీళ్ళకి వేసినా వేస్టే అన్న భావనతో ఫ్యాన్ గుర్తుకి గుద్దేస్తారా అన్నది వేచి చూడాలి. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది.
నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఓడిపోయే పార్టీలపై బెట్టింగులు జరగడం సమ్ థింగ్ స్పెషల్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక్కడ బీజేపీ కంటే కాంగ్రెస్కే ఎక్కువ ఓట్లు వస్తాయన్న బెట్టింగ్లు ఎంతవరకూ నిజం అవుతాయో చూద్దాం.
తాజావార్తలు
-
CM Revanth Reddy: తెలంగాణకు ‘మెగా గ్రోత్ కారిడార్’.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
-
IPL 2026 Playoffs Chances: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. నాలుగో స్థానం కోసం అసలు పోటీ, ఆ లక్కీ టీమ్ ఏదో!
-
Vijay : జాసన్ విజయ్ కు CM విజయ్ సపోర్ట్ ఉంటుందా.. సందీప్ కిషన్ తో సినిమా ఏమైంది?
-
Coal Gasification Scheme: బొగ్గు నుంచి సింథటిక్ గ్యాస్.. రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు.. 50,000 జాబ్స్!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!