Bode Ramachandra Yadav: బీసీ హక్కుల కోసం మంగళగిరిలో మహా పోరాటం.. రామచంద్ర యాదవ్ ఆమరణ దీక్ష
- మంగళగిరిలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం
- బీసీ హక్కుల కోసం రామచంద్ర యాదవ్ పోరాటం
- జాతీయ స్థాయి నేతల మద్దతు వెల్లువ
- ఐదు డిమాండ్లపై ప్రభుత్వ స్పందన కోరుతూ నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీసీ సామాజిక వర్గాల సమగ్ర అభ్యున్నతే ధ్యేయంగా భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ మంగళగిరిలో ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయ ఆవరణలో ప్రారంభమైన ఈ ‘ధర్మ దీక్ష’కు రాష్ట్రవ్యాప్తంగా వివిధ బీసీ సంఘాల నాయకులు, మేధావులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సంఘీభావాన్ని ప్రకటించారు. గతంలో నిర్వహించిన “బీసీ సింహగర్జన” సభలో ఐదు కీలక డిమాండ్లను ప్రస్తావించిన రామచంద్ర యాదవ్, వాటిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే ఈ నిరసన బాట పట్టినట్లు స్పష్టం చేశారు. అణగారిన వర్గాల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తానని, బీసీల సమస్యల పరిష్కారం అయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని ఆయన ఈ సందర్భంగా భీష్మించుకున్నారు.

Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్లో 900 పిల్లలను రక్షించాం..
రామచంద్ర యాదవ్ చేపట్టిన ఈ పోరాటానికి జాతీయ స్థాయిలోనూ భారీ మద్దతు లభించింది. ఓబీసీ రిజర్వేషన్ల కోసం చారిత్రాత్మక పోరాటం చేసిన బీపీ మండల్ మనుమడు డా. సూరజ్ మండల్ స్వయంగా హాజరై ఈ దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయనతో పాటు జ్యోతిబా పూలే మనుమరాలు డా. ఎస్. పూలే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రామచంద్ర యాదవ్ చేస్తున్న పోరాటాన్ని అభినందించారు. బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి రాజ్యాధికారాన్ని సాధించినప్పుడే సామాజిక సమన్యాయం జరుగుతుందని, అణగారిన వర్గాల గొంతుకగా నిలుస్తున్న ఈ దీక్షకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామని వారు వ్యాఖ్యానించారు. బీసీల చైతన్యమే లక్ష్యంగా సాగుతున్న ఈ దీక్ష ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.
Rilee Rossouw: “ఐపీఎల్ ఒక సినిమా డ్రామా”.. IPL కంటే PSL గ్రేట్ అంటూ రోసో పిచ్చి కూతలు..
తాజావార్తలు
-
CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
-
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
-
Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
-
Chinmayi: డబ్బింగ్ రూమ్లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..