బీసీ సామాజిక వర్గాల సమగ్ర అభ్యున్నతే ధ్యేయంగా భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ మంగళగిరిలో ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయ ఆవరణలో ప్రారంభమైన ఈ ‘ధర్మ దీక్ష’కు రాష్ట్రవ్యాప్తంగా వివిధ బీసీ సంఘాల నాయకులు, మేధావులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సంఘీభావాన్ని ప్రకటించారు. గతంలో నిర్వహించిన “బీసీ సింహగర్జన” సభలో ఐదు కీలక డిమాండ్లను ప్రస్తావించిన రామచంద్ర యాదవ్, వాటిపై ప్రభుత్వం…