BCCI: మరో క్రికెట్ సమరం.. ఆంధ్రా ప్రీమియర్ లీగ్కు ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరికొద్దిరోజుల్లోనే ఐపీఎల్ సమరం ముగియనుంది. ఈ ఐపీఎల్ సీజన్లో ఇంకా రెండు మ్యాచ్లే మిగిలి ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల క్రికెట్ ప్రేమికులు ఏ మాత్రం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే మరో క్రికెట్ సమరం ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు ఆంధ్రా ప్రీమియర్ లీగ్కు బీసీసీఐ ఆమోదం పలికింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ లీగ్ జరగనుంది. ఈ విషయాన్ని ఏసీఏ కోశాధికారి ఎస్ఆర్ గోపీనాథ్రెడ్డి, ఏసీఏ సభ్యులు ప్రకటించారు.
Hockey: ఆసియా కప్లో అద్భుతం చేసిన భారత్
Also Read
జూన్ 22 నుంచి ప్రారంభం అయ్యే ఆంధ్రా ప్రీమియర్ లీగ్కు ఏసీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఏసీఏ కోశాధికారి గోపీనాథ్రెడ్డి వెల్లడించారు. ఈ టోర్నీ గ్రాండ్ సక్సెస్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా ఆంధ్రా ప్రీమియర్ లీగ్ను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పురుషుల మ్యాచ్లు జూన్ 22 నుంచి జూలై 3 వరకు జరుగుతాయని.. మహిళల మ్యాచ్లు జూన్ 28 నుంచి జూలై 3 వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పురుషుల మ్యాచ్లన్నీ విశాఖ క్రికెట్ స్టేడియంలోనే జరుగుతాయని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
-
OTR: వైజాగ్ పాలిటిక్స్లో తన ముద్ర కోసం శ్రీభరత్ తిప్పలు.?
-
OTR: ఇక నుంచి సీఎం రేవంత్ సభల్లో కీలక మార్పులు
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!