Bandi Sanjay: కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీ అభివృద్ధి చెందుతోంది..
- కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీ అభివృద్ధి చెందుతోంది..
- ఏపీని స్పూర్తిగా తీసుకొని మేము తెలంగాణలో అధికారంలోకి వస్తాం..
- తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ మోడీ సర్కార్ నిధులే: బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి శత జయంతి వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదములు.. అటల్- మోడీ సుపరిపాలన యాత్ర కార్యక్రమం అద్భుతమైనది.. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.. దేశంలో చరిత్ర సృష్టించింది ఏపీ.. ప్రతీ జిల్లాలో వాజ్ పేయ్ విగ్రహాలు పెట్టించడం నిజంగా అద్భుతం అన్నారు. తెలిపారు బండి సంజయ్.
Read Also: India T20 World Cup 2026 Squad: టీ 20 వరల్డ్ కప్కు టీమిండియా జట్టు ఇదే.. పాపం గిల్!
Also Read
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
- PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
- Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
- Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
అయితే, తెలంగాణలో అధికారంలోకి వచ్చాక మేము కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. విశాఖకు చాలా సార్లు వచ్చిన కానీ, వచ్చిన ప్రతీ సారి ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది.. పోరాటాల గడ్డ విశాఖ అడ్డా.. విశాఖ నేవీకి బలం, పరిశ్రమలకు ముఖ ద్వారం అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలందరికీ.. పవిత్ర గడ్డ మీద వాజ్ పేయ్ విగ్రహ ఆవిష్కరణ అవకాశం నా పూర్వ జన్మ సుకృతమన్నారు. కాగా, RSS కేవలం ఒక సంస్థ కాదు.. వాజ్ పేయ్ కి బీజేపీ, ఒక వర్గం ప్రజలు మాత్రమే కాదు యావత్ భారత్ అండగా నిలబడిందని బండి సంజయ్ పేర్కొన్నారు.
Read Also: HYDRA Lake Restoration: చారిత్రక చెరువుకు హైడ్రా పునర్జన్మ..
ఇక, తెలంగాణలో మేము అధికారంలోకి వస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ను దేశం నుంచి తరిమి కొట్టాలి.. దేశంలో మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది.. ఏపీలో కూకటి వేళ్ళతో పెకిలించి సముద్రంలో కలిపారు.. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది.. ఏపీని స్పూర్తిగా తీసుకొని మేము తెలంగాణలో అధికారంలోకి వస్తాం.. తెలంగాణలో కాంగ్రెస్ బోర్లపడింది.. ఇచ్చిన హామీలను అమలు చేయలేక పోతుంది.. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయాడు.. క్రియశీలకంగా లేరు.. ప్రజలు కూడా ఆయన్ని మర్చిపోయారు.. కేసీఆర్ పాలనతో విసిగి.. మనకు పడాల్సిన ఓట్లు కాంగ్రెస్ పడ్డాయని పేర్కొన్నారు. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు మోడీ సర్కార్ నిధులేనని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Alprazolam Seizure : సైబరాబాద్లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?