Balakrishna: ఈ ప్రభుత్వం గుడిని, అందులోని లింగాన్ని మింగే రకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెనాలి పెమ్మసాని థియేటర్లో నిర్వహించిన నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇప్పుడున్న ప్రభుత్వం గుడిని, అందులోని లింగాన్ని మింగేసే రకమని మండిపడ్డారు. ‘‘ఒక్క ఛాన్స్ అంటే, ఒక్క తప్పిదం చేశారు, ఓటు వేశారు, ఇకనైనా ఆత్మ విమర్శ చేసుకోండి’’ అంటూ ఏపీ ప్రజల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘దేశమంటే కట్టి కాదోయ్, దేశమంటే మనుషులో అని ఆనాడు గురజాడ అప్పారావు అన్నారు. కానీ, దానికి పూర్తి వ్యతిరేకంగా మన రాష్ట్ర పరిస్థితి ఉంది. ఒకప్పుడు ఎక్కడో ఉన్నాం, ఇప్పుడు ఎక్కడున్నాం? కాబట్టి మీరే ఆలోచించుకోండి’’ అని బాలయ్య అన్నారు.
తన తండ్రి ఎన్టీ రామారావు ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, ప్రభుత్వ ఉద్యోగం చేసి, సినీ రంగంలోకి ప్రవేశించి, తిరుగులేని మహానటుడిగా వేలాదిమంది హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని బాలయ్య అన్నారు. తెలుగువారికి ఏ ఆపద వచ్చినా ఆయన ముందుండేవారన్నారు. ఆనాడు సీమ ప్రజలు కరువుతో ఇబ్బంది పడుతున్న రోజుల్లో జోలి పట్టిన గొప్ప సంఘసంస్కర్త ఆయన అని బాలయ్య చెప్పారు. దివిసీమ ఉప్పెన సమయంలోనూ ప్రజల్ని ఆదుకున్నారని, దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికుల కోసం నిధి కూడా ఏర్పాటు చేశారని గుర్తు చేసుకున్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న రోజుల్లో.. రాజకీయాల్లోకి అడుగుపెట్టి, మడమ తిప్పకుండా పోరాడిన వ్యక్తి అని వెల్లడించారు.
Also Read
- Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
- Pawan Kalyan : ఏపీలో రక్షణ రంగ విప్లవం.. మెగా ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం.!
- Illegal Ration Rice: అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం.. 2 వేల కేజీల బియ్యం స్వాధీనం!
తెలుగుదేశాన్ని స్థాపించి, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నిరూపించి, బడుగు – బలహీనుల్ని సైతం అధికారం పీఠంపై కూర్చొబెట్టిన మహానుభావుడు తారకరామావు అంటూ బాలయ్య చెప్పుకొచ్చారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పేదవాడికి ఇల్లు, ఇలా ఎన్నో సంస్కరణల్ని ఆయన ప్రశేశపెట్టారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆలోచించి, ఓట్లు వేయాల్సిందిగా బాలయ్య కోరారు.
తాజావార్తలు
-
LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!