Vizag Auto Driver Crime: పరిచయస్తుడే కదా నమ్మి వెళ్తే.. అన్యాయంగా చంపేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Auto Driver Raju Killed Woman In Vizag And Escapes With Gold: పరిచయస్తుడే కదా అని ఒక మహిళ నమ్మి వెళ్తే.. ఆటో డ్రైవర్ ఆమెను అన్యాయంగా చంపేశాడు. ఆటోను స్టార్ట్ చేసే తాడుతో మెడకు బిగించి, దారుణంగా హతమార్చాడు. అనంతరం ఏమీ ఎరుగనట్టుగా మిన్నకుండిపోయాడు. అయితే.. బంధువులకు అనుమానం రావడంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు తమదైన శైలిలో విచారించగా.. అతడు అసలు నిజం కక్కేశాడు. ఆ మహిళను ఎందుకు చంపాడో చెప్పాడు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Doctor Stabbed To Death: వైద్యం చేస్తుండగా లేడీ డాక్టర్ని పొడిచి చంపిన పేషెంట్..
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
విశాఖపట్నంలోని తగరపువలస బాలాజీ నగర్లో రేసు గోపి అనే మహిళ తన ఏడేళ్ల కుమారుడితో ఒంటరిగా ఉంటోంది. మనస్పర్థల కారణంగా ఆమె భర్తకు విడాకులు ఇచ్చింది. కట్ చేస్తే.. బంధవుల ఇంట్లో శుభకార్యం ఉందని, ఆ కార్యక్రమానికి వెళ్లేందుకు రెడీ అయ్యింది. ఆ ఈవెంట్కు హాజరై.. తిరిగి ఇంటికి కూడా బయలుదేరింది. కానీ.. ఆమె ఇంటికి చేరుకోలేదు. దీంతో.. బంధవులు ఆమె కోసం ఆరాతీయడం మొదలుపెట్టారు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో.. ఈనెల 1వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండో తేదీ మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె కోసం గాలించడం మొదలుపెట్టారు. మరోవైపు.. బంధవులుకు చేపలుప్పాడకు చెందిన ఆటో డ్రైవర్ మైలిపల్లి రాజుపై అనుమానం కలిగింది. రేసు గోపి అదృశ్యం వెనుక అతని హస్తం ఉండొచ్చని అనుమానించి, అతని గురించి పోలీసులకు తెలియజేశారు.
Rohit Sharma: రోహిత్ మరో చెత్త రికార్డ్.. చరిత్రలో తొలిసారి
బంధవులు ఇచ్చిన సమాచారంతో.. పోలీసులు రాజుని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో అతడ్ని విచారించారు. అప్పుడు ఆతడు తానే రేసు గోపిని హతమార్చినట్టు ఒప్పుకున్నాడు. ఆమె మృతదేహాన్ని చిలుకూరి లేఔట్ గెడ్డలో పడేసినట్టు చెప్పడంతో.. కుళ్లిన స్థితిలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. రేసు గోపికి, ఆటో డ్రైవర్ రాజుకి చాలాకాలం నుంచి పరిచయం ఉన్నట్టు విచారణలో తేలింది. వారి మధ్య సాన్నిహిత సంబంధం కూడా ఉండేదని, ఆ తర్వాత ఇద్దరు దూరమయ్యారని తేలింది. మళ్లీ శుభకార్యం వద్ద వీళ్లు కలుసుకున్నారని, ఆమె వద్ద బంగారం ఉందని తెలిసి రాజు ఆమెని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడని, అనంతరం 4 తులాల బంగారాన్ని రాజు ఎత్తుకెళ్లాడని తెలిసింది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!