Vizag Auto Driver Crime: పరిచయస్తుడే కదా నమ్మి వెళ్తే.. అన్యాయంగా చంపేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Auto Driver Raju Killed Woman In Vizag And Escapes With Gold: పరిచయస్తుడే కదా అని ఒక మహిళ నమ్మి వెళ్తే.. ఆటో డ్రైవర్ ఆమెను అన్యాయంగా చంపేశాడు. ఆటోను స్టార్ట్ చేసే తాడుతో మెడకు బిగించి, దారుణంగా హతమార్చాడు. అనంతరం ఏమీ ఎరుగనట్టుగా మిన్నకుండిపోయాడు. అయితే.. బంధువులకు అనుమానం రావడంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు తమదైన శైలిలో విచారించగా.. అతడు అసలు నిజం కక్కేశాడు. ఆ మహిళను ఎందుకు చంపాడో చెప్పాడు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Doctor Stabbed To Death: వైద్యం చేస్తుండగా లేడీ డాక్టర్ని పొడిచి చంపిన పేషెంట్..
Also Read
విశాఖపట్నంలోని తగరపువలస బాలాజీ నగర్లో రేసు గోపి అనే మహిళ తన ఏడేళ్ల కుమారుడితో ఒంటరిగా ఉంటోంది. మనస్పర్థల కారణంగా ఆమె భర్తకు విడాకులు ఇచ్చింది. కట్ చేస్తే.. బంధవుల ఇంట్లో శుభకార్యం ఉందని, ఆ కార్యక్రమానికి వెళ్లేందుకు రెడీ అయ్యింది. ఆ ఈవెంట్కు హాజరై.. తిరిగి ఇంటికి కూడా బయలుదేరింది. కానీ.. ఆమె ఇంటికి చేరుకోలేదు. దీంతో.. బంధవులు ఆమె కోసం ఆరాతీయడం మొదలుపెట్టారు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో.. ఈనెల 1వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండో తేదీ మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె కోసం గాలించడం మొదలుపెట్టారు. మరోవైపు.. బంధవులుకు చేపలుప్పాడకు చెందిన ఆటో డ్రైవర్ మైలిపల్లి రాజుపై అనుమానం కలిగింది. రేసు గోపి అదృశ్యం వెనుక అతని హస్తం ఉండొచ్చని అనుమానించి, అతని గురించి పోలీసులకు తెలియజేశారు.
Rohit Sharma: రోహిత్ మరో చెత్త రికార్డ్.. చరిత్రలో తొలిసారి
బంధవులు ఇచ్చిన సమాచారంతో.. పోలీసులు రాజుని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో అతడ్ని విచారించారు. అప్పుడు ఆతడు తానే రేసు గోపిని హతమార్చినట్టు ఒప్పుకున్నాడు. ఆమె మృతదేహాన్ని చిలుకూరి లేఔట్ గెడ్డలో పడేసినట్టు చెప్పడంతో.. కుళ్లిన స్థితిలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. రేసు గోపికి, ఆటో డ్రైవర్ రాజుకి చాలాకాలం నుంచి పరిచయం ఉన్నట్టు విచారణలో తేలింది. వారి మధ్య సాన్నిహిత సంబంధం కూడా ఉండేదని, ఆ తర్వాత ఇద్దరు దూరమయ్యారని తేలింది. మళ్లీ శుభకార్యం వద్ద వీళ్లు కలుసుకున్నారని, ఆమె వద్ద బంగారం ఉందని తెలిసి రాజు ఆమెని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడని, అనంతరం 4 తులాల బంగారాన్ని రాజు ఎత్తుకెళ్లాడని తెలిసింది.
తాజావార్తలు
-
Centre Orders Google, Apple: ప్రయాణికుల భద్రతకు ముప్పు.. గూగుల్, యాపిల్కు కేంద్రం కీలక ఆదేశాలు
-
Janhvi Kapoor: ఒక్క ఇన్స్టా పోస్ట్కే అన్ని లక్షలా!… జాన్వీ డిజిటల్ ఆదాయం షాకింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Renault Kwid Facelift: రెనాల్ట్ క్విడ్ ఫేస్లిఫ్ట్ విడుదల.. 17 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు, రూ.4.52 లక్షలకే..!
-
Ahilyanagar: అదుపుతప్పి బోల్తా పడ్డ స్కూల్ బస్సు.. 50 మంది విద్యార్థులతో వెళ్తుండగా ప్రమాదం.!
ట్రెండింగ్
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!