Rohit Sharma: రోహిత్ మరో చెత్త రికార్డ్.. చరిత్రలో తొలిసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Another Worst Record In IPL: ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారుగా! ఒక్క అర్థశతకం మినహాయిస్తే, చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఏమీ అతడు ఆడలేదు. డకౌట్స్ లేదా సింగిల్ డిజిట్ పరుగులకే పరిమితం అవుతున్నాడు. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లోనూ.. 8 బంతుల్లో కేవలం 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. వనిందు హసరంగ బౌలింగ్లో భారీ షాట్ కొట్టేందుకు ముందుకొచ్చి, ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
Naveen Ul Haq: చిల్లర వేషాలు మానుకోకపోతే.. అడ్రస్ లేకుండా పోతావ్
Also Read
- FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
- 2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- FIFA World Cup 2026: హోరాహోరీ పోరులో.. ఫ్రాన్స్పై 6-4తో ఇంగ్లండ్ ఘన విజయం.. కాంస్య పతకం కైవసం

ఈ క్రమంలోనే రోహిత్ తన పేరిట అత్యంత చెత్త రికార్డ్ని లిఖించుకున్నాడు. ఐపీఎల్లో వరుసగా ఐదు మ్యాచ్ల్లో సింగిల్ డిజిట్ పరుగులకే పరిమితం అవడం.. రోహిత్కు ఇదే తొలిసారి. గత ఐదు మ్యాచ్ల్లో రోహిత్ వరుసగా 2,3,0,0,7 స్కోర్లు నమోదు చేశాడు. ఇంతకుముందు 2017లో వరుసగా నాలుగు మ్యాచ్ల్లో సింగిల్ డిజిట్కే పరిమితమైన రోహిత్.. ఈ సీజన్లో ఐదు మ్యాచ్ల్లో సింగిల్ డిజిట్ పరుగులే చేసి, తన రికార్డ్ని తానే బద్దలుకొట్టుకున్నాడు. ఈ మ్యాచ్కి ముందు చెన్నైతో జరిగిన మ్యాచ్లో రోహిత్ డకౌట్గా వెనుదిరిగడంతో.. ఐపీఎల్లో అత్యధికసార్లు (16 సార్లు) డకౌట్ అయిన ప్లేయర్గానూ అతడు చెత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఓవరాల్గా ఈ సీజన్లో రోహిత్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే.. 11 మ్యాచ్ల్లో 191 పరుగులే చేశాడు. అందులో ఒక అర్థశతకం ఉంది.
Pawan Kalyan: కొంచెం ఊపిరి పీల్చుకొనే టైమ్ అన్నా ఇవ్వండన్నా.. చంపేస్తారా
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. మ్యాక్స్వెల్ (68), డు ప్లెసిస్ (65), దినేశ్ కార్తిక్ (30) రాణించడంతో.. ఆర్సీబీ అంత భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు.. 16.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. సూర్యకుమార్ (83), నేహాల్ (52), ఇషాన్ కిషన్ (42) ఊచకోత కోయడం వల్లే.. ముంబై అంత భారీ లక్ష్యాన్ని 16.3 ఓవర్లలోనే ఛేధించగలిగింది. ఈ విజయంతో.. ముంబై జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానం నుంచి ఏకంగా 3వ స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డ్ గెలుచుకున్నాడు.
తాజావార్తలు
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
-
Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!